Political News

మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్రం హోమ్‌.. రెడీ అయిపోవ‌డ‌మే!

దేశంలో మ‌ళ్లీ గ‌త ఏడాది ప‌రిస్థితే.. తెర‌మీద‌కి వ‌స్తోంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌బుత్వ, ప్రైవేటు సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోంను అమ‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు చ‌నిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈనేప‌థ్యంలో వ‌ర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్‌ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేస‌మ‌యంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప ‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్న సీఎంలు.. త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని స‌మాచారం. ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా సోకిన నేపథ్యంలో సోమ‌వా రం ఏపీ సీఎం జ‌గ‌న్.. అన్ని శాఖ‌ల అధికారుల‌తోనూ కోవిడ్‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్‌.. సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో అప్ర‌క‌టిత లాక్ డౌన్‌తోపాటు.. రాత్రివేళ క‌ర్ఫ్యూ ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మ‌రో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు త‌ప్పేలా లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 18, 2021 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

22 seconds ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

8 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

2 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

8 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

12 hours ago