దేశంలో మళ్లీ గత ఏడాది పరిస్థితే.. తెరమీదకి వస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇదే సమయానికి లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ప్రబుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోంను అమలు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో వర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.
ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేసమయంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్న సీఎంలు.. త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్కు కరోనా సోకిన నేపథ్యంలో సోమవా రం ఏపీ సీఎం జగన్.. అన్ని శాఖల అధికారులతోనూ కోవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక, తెలంగాణలోనూ సీఎం కేసీఆర్.. సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో అప్రకటిత లాక్ డౌన్తోపాటు.. రాత్రివేళ కర్ఫ్యూ ఆలోచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మరో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు తప్పేలా లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 18, 2021 3:08 pm
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…