దేశంలో మళ్లీ గత ఏడాది పరిస్థితే.. తెరమీదకి వస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇదే సమయానికి లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ప్రబుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోంను అమలు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో వర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.
ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేసమయంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్న సీఎంలు.. త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్కు కరోనా సోకిన నేపథ్యంలో సోమవా రం ఏపీ సీఎం జగన్.. అన్ని శాఖల అధికారులతోనూ కోవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక, తెలంగాణలోనూ సీఎం కేసీఆర్.. సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో అప్రకటిత లాక్ డౌన్తోపాటు.. రాత్రివేళ కర్ఫ్యూ ఆలోచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మరో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు తప్పేలా లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 18, 2021 3:08 pm
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…