దేశంలో మళ్లీ గత ఏడాది పరిస్థితే.. తెరమీదకి వస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇదే సమయానికి లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ప్రబుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోంను అమలు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో వర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.
ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేసమయంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్న సీఎంలు.. త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్కు కరోనా సోకిన నేపథ్యంలో సోమవా రం ఏపీ సీఎం జగన్.. అన్ని శాఖల అధికారులతోనూ కోవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక, తెలంగాణలోనూ సీఎం కేసీఆర్.. సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో అప్రకటిత లాక్ డౌన్తోపాటు.. రాత్రివేళ కర్ఫ్యూ ఆలోచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మరో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు తప్పేలా లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 18, 2021 3:08 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…