Political News

మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్రం హోమ్‌.. రెడీ అయిపోవ‌డ‌మే!

దేశంలో మ‌ళ్లీ గ‌త ఏడాది ప‌రిస్థితే.. తెర‌మీద‌కి వ‌స్తోంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌బుత్వ, ప్రైవేటు సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోంను అమ‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు చ‌నిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈనేప‌థ్యంలో వ‌ర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్‌ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేస‌మ‌యంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప ‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్న సీఎంలు.. త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని స‌మాచారం. ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా సోకిన నేపథ్యంలో సోమ‌వా రం ఏపీ సీఎం జ‌గ‌న్.. అన్ని శాఖ‌ల అధికారుల‌తోనూ కోవిడ్‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్‌.. సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో అప్ర‌క‌టిత లాక్ డౌన్‌తోపాటు.. రాత్రివేళ క‌ర్ఫ్యూ ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మ‌రో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు త‌ప్పేలా లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 18, 2021 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

34 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

1 hour ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

1 hour ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

1 hour ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

5 hours ago