Political News

మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్రం హోమ్‌.. రెడీ అయిపోవ‌డ‌మే!

దేశంలో మ‌ళ్లీ గ‌త ఏడాది ప‌రిస్థితే.. తెర‌మీద‌కి వ‌స్తోంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌బుత్వ, ప్రైవేటు సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోంను అమ‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు చ‌నిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈనేప‌థ్యంలో వ‌ర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్‌ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేస‌మ‌యంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప ‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్న సీఎంలు.. త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని స‌మాచారం. ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా సోకిన నేపథ్యంలో సోమ‌వా రం ఏపీ సీఎం జ‌గ‌న్.. అన్ని శాఖ‌ల అధికారుల‌తోనూ కోవిడ్‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్‌.. సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో అప్ర‌క‌టిత లాక్ డౌన్‌తోపాటు.. రాత్రివేళ క‌ర్ఫ్యూ ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మ‌రో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు త‌ప్పేలా లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 18, 2021 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago