రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వారసులు వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా తెరమీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లోనూ వారసులు పోటీ చేశారు. అయితే.. ఇది ఏకపక్షంగా టీడీపీ నుంచే కనిపించింది. కానీ.. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ తెరమీదికి వచ్చేందుకు కొందరు వారసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అయితే.. వీరంతా ప్రజల్లోకి వస్తున్నారా ? రాజకీయంగా చక్రం తిప్పుతున్నారా ? అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. దీంతో వీరినిగమనిస్తున్నవారు.. తండ్రి చాటు తనయులుగానే ఉంటున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి చూస్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, యనమల రామకృష్ణుడు కుమార్తె, బుచ్చయ్య చౌదరి సోదరుడి కుమారుడు, మాగంటి కుటుంబం నుంచి రెండో కుమారుడు.. వంటివారు చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇక గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడి నిరాశపడ్డ రాయపాటి, కోడెల వారసులు లైన్లోనే ఉన్నారు. ఈ సారి గుంటూరు జిల్లా నుంచి యరపతినేని, జీవి. ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీథర్ వారసులు పొలిటికల్ తెరను అల్లాడించేందుకు రెడీ అవుతున్నారు.
వీరు కాకుండా చాలా మంది తెరవెనుక ఉన్నారని తెలుస్తోంది. ఇక, గత ఎన్నికలలోనే కొంతమంది కొత్తవారికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే.. వారంతా కూడా విఫలమయ్యారు. ఇక, ఇప్పుడు కొత్తవారు తెరమీదకి వస్తున్ననేపథ్యంలో వారికి టికెట్ ఇచ్చినా గెలుస్తారా ? అనేది ప్రశ్న. పోనీ.. ఇప్పటి నుంచి ప్రజాబాహుళ్యంలో ఏమైనా తిప్పుతు న్నారా ? అంటే అది కూడా కష్టమే.. అంటున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ వారసుల వరుస బాగానే కనిపిస్తోంది. ఏకంగా మంత్రి బొత్స తనయుడు, స్పీకర్ సీతారాం తనయుడు, నూజివీడు ఎమ్మెల్యే తనయుడు, ప్రభుత్వ చీఫ్ విప్.. శ్రీకాంత్ రెడ్డి సోదరుడు, వంటివారు కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు వీరు అధికారికంగా.. ప్రకటించకపోయినా.. నియోజకవర్గాల్లో మాత్రం చక్రం తిప్పుతున్నారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కొడుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వీరు కొంత మేరకు నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నా.. టీడీపీ నేతల తనయులు మాత్రం.. ఎక్కడా కనిపించడం లేదు. కానీ, పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
This post was last modified on April 18, 2021 11:57 am
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…
తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…
చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…