రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వారసులు వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా తెరమీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లోనూ వారసులు పోటీ చేశారు. అయితే.. ఇది ఏకపక్షంగా టీడీపీ నుంచే కనిపించింది. కానీ.. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ తెరమీదికి వచ్చేందుకు కొందరు వారసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అయితే.. వీరంతా ప్రజల్లోకి వస్తున్నారా ? రాజకీయంగా చక్రం తిప్పుతున్నారా ? అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. దీంతో వీరినిగమనిస్తున్నవారు.. తండ్రి చాటు తనయులుగానే ఉంటున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి చూస్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, యనమల రామకృష్ణుడు కుమార్తె, బుచ్చయ్య చౌదరి సోదరుడి కుమారుడు, మాగంటి కుటుంబం నుంచి రెండో కుమారుడు.. వంటివారు చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇక గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడి నిరాశపడ్డ రాయపాటి, కోడెల వారసులు లైన్లోనే ఉన్నారు. ఈ సారి గుంటూరు జిల్లా నుంచి యరపతినేని, జీవి. ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీథర్ వారసులు పొలిటికల్ తెరను అల్లాడించేందుకు రెడీ అవుతున్నారు.
వీరు కాకుండా చాలా మంది తెరవెనుక ఉన్నారని తెలుస్తోంది. ఇక, గత ఎన్నికలలోనే కొంతమంది కొత్తవారికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే.. వారంతా కూడా విఫలమయ్యారు. ఇక, ఇప్పుడు కొత్తవారు తెరమీదకి వస్తున్ననేపథ్యంలో వారికి టికెట్ ఇచ్చినా గెలుస్తారా ? అనేది ప్రశ్న. పోనీ.. ఇప్పటి నుంచి ప్రజాబాహుళ్యంలో ఏమైనా తిప్పుతు న్నారా ? అంటే అది కూడా కష్టమే.. అంటున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ వారసుల వరుస బాగానే కనిపిస్తోంది. ఏకంగా మంత్రి బొత్స తనయుడు, స్పీకర్ సీతారాం తనయుడు, నూజివీడు ఎమ్మెల్యే తనయుడు, ప్రభుత్వ చీఫ్ విప్.. శ్రీకాంత్ రెడ్డి సోదరుడు, వంటివారు కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు వీరు అధికారికంగా.. ప్రకటించకపోయినా.. నియోజకవర్గాల్లో మాత్రం చక్రం తిప్పుతున్నారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కొడుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వీరు కొంత మేరకు నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నా.. టీడీపీ నేతల తనయులు మాత్రం.. ఎక్కడా కనిపించడం లేదు. కానీ, పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
This post was last modified on April 18, 2021 11:57 am
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…