Political News

తిరుపతిపై పెరిగిపోతున్న టెన్షన్

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీలో టెన్షన్ పెరిగిపోతోంది. మిగిలిన ఆరు నియోజకవర్గాలతో పోల్చితే తిరుపతిలో చాలా తక్కువగా పోలింగ్ జరిగింది. మిగిలిన చోట్ల సగటున 70 శాతం పోలింగ్ జరిగిత తిరుపతిలో మాత్రం 50 శాతమే పోలింగ్ నమోదైంది. ఇంత తక్కువ పోలింగ్ గతంలో ఎప్పుడు జరగలేదు. మామూలుగానే ఓవరాల్ గా పోలింగ్ తగ్గిపోవటం ఒక ఎత్తైతే తిరుపతిలో మరీ దారుణంగా పడిపోవటం మరో ఎత్తుగా కనబడుతోంది.

మరి తగ్గిపోయిన పోలింగ్ దేనికి సంకేతమో అర్ధంకావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా తిరుపతిలో వైసీపీకి ఎంపి పోలింగ్ విషయంలో మైనస్ వచ్చింది. అసెంబ్లీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి అతికష్టం మీద 700 ఓట్లతో బయటపడ్డారు. అదే పార్లమెంటుకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్ధికి 3580 ఓట్లు మైనస్ వచ్చింది. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

అయితే ప్రస్తుత విషయానికి వస్తే కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉపఎన్నిక జరిగింది కాబట్టి భూమన సత్తా ఏమిటో తేలిపోతుంది. అందుకనే తిరుపతిలో మెజారిటి తీసుకురావటానికి భూమన+కొడుకు అభినయరెడ్డి బాగా కష్టపడ్డారు. సరే వీళ్ళంతె కష్టపడినా తిరుపతిలో ఓటింగ్ మాత్రం అత్యల్పంగా నమోదైంది. అయితే నమోదైన ఓటింగ్ లోనే వైసీపీకి ఎన్నిపడ్డాయన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు.

ఇదే పరిస్ధితి టీడీపీలో కూడా కనబడుతోంది. పోలింగ్ శాతం బాగా తగ్గిపోవటంతో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో అర్ధం కావటంలేదు. మొదటినుండి కూడా మిగిలిన నియోజకవర్గాలను వదిలేసి చంద్రబాబునాయుడు అండ్ కో తిరుపతి మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. మిగిలిన ఆరు నియోజకవర్గాలతో పోల్చితే తిరుపతిలోనే కొద్దో గొప్పో నాయకత్వం బలంగా ఉంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో మెజారిటి రావటంతో దాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ బాగా కష్టపడింది. అందుకనే తాజా పోలింగ్ శాతం కారణంగా రెండుపార్టీల్లోను ఇపుడు టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on April 18, 2021 11:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

1 hour ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

2 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

2 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

3 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

3 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

4 hours ago