Political News

ఫోన్ కు దొరకని ప్రధానమంత్రి

అవును ఓ ముఖ్యమంత్రి అర్జంటుగా మాట్లాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఫోన్ చేస్తే మాట్లాడేందుకు నిరాకరించారట. ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మహారాష్ట్ర వణికిపోతున్న విషయం చెబుదామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎంత ప్రయత్నించినా మోడి మాత్రం మాట్లాడేందుకు ఇష్టపడలేదు. థాక్రే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రధానమంత్రి బిజీబిజీ అని సిబ్బంది చెప్పారట. దాంతో తనతో మాట్లాడటం మోడికి ఇష్టంలేదని సీఎంకు అర్ధమైపోయిందట.

ఇదే విషయాన్ని థాక్రే బయటపెట్టడంతో పెద్ద సంచలనంగా మారింది. మొదటినుండి కూడా బీజేపీయేతర రాష్ట్రాలంటే కేంద్రం నిర్లక్ష్యంగానే ఉంది. ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా కేంద్రం తరపున ఇవ్వాల్సినంత మద్దతు ఇవ్వటం లేదనే ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్నా, వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన వారిసంఖ్య పెరిగిపోతున్న కేంద్రంనుండి మాత్రం సరైన ప్రోత్సాహంలేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ కొరత మహారాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొడుతోంది. దేశం మొత్తంమీద అత్యధిక కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇందుకనే కోవిడ్ వ్యాక్సిన్, రెమ్ డెసివిర్ చాలా అవసరమని సీఎం ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని థాక్రే పెద్ద బాంబు పేల్చారు. తాను మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రధానమంత్రి చాలా బిజీబిజీగా ఉన్నారని వ్యక్తిగత సిబ్బంది బదులిచ్చినట్లు చెప్పారు.

ఓ సీఎంతో మాట్లాడలేనంత బిజీగా ప్రధానమంత్రి ఏమి చేస్తున్నారయ్యా అంటే బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇదే విషయమై సీఎం మాట్లాడుతు ప్రజల ప్రాణాలకు సంబందించిన విషయం కన్నా ప్రధానికి పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారమే ఎక్కువైపోయిందంటు మండిపోయారు. మహరాష్ట్రకు రెమ్ డెసివిర్ సరఫరా ఇవ్వద్దని మోడి కంపెనీలకు చెప్పినట్లు థాక్రే ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్, కోవిడ్ టీకాలకు తీవ్రమైన కొరతుందంటు మొత్తుకున్నారు. మొత్తానికి బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కరోనా వైరస్ విషయంలో కూడా మోడి ఎలా వ్యవహరిస్తున్నారనేందుకు ఇదే తాజా ఉదాహరణగా నిలిచింది.

This post was last modified on April 18, 2021 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago