వైసీపీ కీలక నాయకుడు.. రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఏమయ్యారు ? ఎప్పుడూ.. తన ట్వీట్టర్ పలుకుల ద్వారా రాజకీయాలను వేడెక్కించే ఆయన ఇటీవల ముగిసిన కార్పొరేషన్ ఎన్నికల తర్వాత.. మటు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించేందుకు నానా యాతన పడ్డ ఆయన అనుకున్నది సాధించారు. అయితే.. భారీ మెజారిటీదక్కించుకోలేక పోయినా.. కార్పొరేషన్ వైసీపీ పరం అయ్యేలా మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఈ గెలుపును జగన్ మాత్రం మెచ్చలేదని వైసీపీ వర్గాల్లోనే టాక్ నడిచింది.
దీంతో వెంటనే వచ్చిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ సత్తా చాటుతారని.. ఆయన ఊపుతో వైసీపీ లో మంచి జోష్ వస్తుందని.. టీడీపీకి కౌంటర్లుకూడా ఇస్తారని అనుకున్నారు. అయితే.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి ఎక్కడా సాయిరెడ్డి ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. సీఎం ఇలా అన్నారు.. అలా అన్నారు అని కానీ.. భారీ మెజారిటీ వస్తుందని కాని.. ఆయన కామెంట్లు చేయలేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు.. తనపై రాళ్ల దాడి జరిగిందని అన్నప్పుడు కానీ.. లోకేష్.. వైఎస్ వివేకా హత్య కేసును అడ్డు పెట్టి ప్రతిజ్ఞలు చేయడం పై కానీ.. సాయిరెడ్డి చూచాయగా కూడా స్పందించలేదు.
తిరుపతిలో అంతా వైవి. సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి హడావిడే కనిపించింది. దీంతో సాయిరెడ్డి ఎక్కడున్నారు ? అసలు ఏపీలో లేరా ? అనే సందేహాలు తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు వైసీపీలో టాక్ నడుస్తోంది. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ.. ట్వీట్ చేయొచ్చుకదా ? ట్విట్టర్లో అయితే యాక్టివ్గానే ఉంటారు కదా ? అనే సందేహాలు వ్యక్తమవుతాయి. అయితే.. కొన్ని కొన్ని సార్లు సాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు.. వికటించి.. వైసీపీ ఇబ్బందుల్లో పడుతోంది.
ఈ నేపథ్యంలో తిరుపతి విషయంలో జోక్యం చేసుకోవద్దని.. జగనే స్వయంగా ఆయనకు సూచించి ఉంటారని.. అందుకే ఆయన మౌనంగా ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా.. తిరుపతి వంటి కీలక ఎన్నిక సమయంలో సాయిరెడ్డి ఊసు లేకుండా పోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.
This post was last modified on April 18, 2021 7:12 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…