రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అధికార పార్టీల్లోకి ప్రజా ప్రతినిధుల జంపింగ్లు కంటిన్యూగా సాగాయి. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. వారం రోజుల క్రితమే అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సైతం గులాబి గూటికి చేరిపోయారు. తెలంగాణలో జంపింగ్ల వార్తలకు బ్రేక్ పడేలా లేదు. ఇక ఏపీలోనూ టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఫ్యాన్ కింద అధికారికంగానో, అనధికారికంగానో సేద తీరుతున్నారు.
ఇక ఏపీలో దాదాపు ఆరేడు నెలలుగా టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు చూసుకుని జంప్ చేసేయాలన్న నిర్ణయానికి చాలా మంది వచ్చేశారనే అంటున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలకు భవిష్యత్తుపై ఆశలేక సైలెంట్ అయిపోయారు. రేపు తిరుపతి ఫలితం కూడా ఏ మాత్రం ఆశాజనకంగా ఉండదన్న నిర్ణయానికి వారు వచ్చేశారట.
తిరుపతి ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు మాజీ మంత్రులు సైతం ఫ్యాన్ కిందకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వీరు అధికార పార్టీ కీలక నేతలతో కొద్ది రోజుల నుంచే టచ్లో ఉంటున్నారని కూడా పార్టీ నేతలే సందేహిస్తున్నారు. తిరుపతి ఫలితం వచ్చిన వెంటనే వారు టీడీపీని వీడిపోనున్నారు. ఇక తెలంగాణలో అశ్వారావుపేట ఎమ్మెల్యే బాటలోనే కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
వీరిలో ఒక ఎమ్మెల్యే & మాజీ మంత్రి కూడా ఉండడం మరో విశేషం. ఇక మరో సీనియర్ ఎమ్మెల్యే కూడా అదే బాటలో ఉన్నారట. వీరు సాగర్ ఫలితం వచ్చిన వెంటనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీరిద్దరికి ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యతతో పాటు వచ్చే ఎన్నికల్లో తిరిగి సిట్టింగ్ సీట్లు కేటాయిస్తామన్న ఆఫర్లు అధికార పార్టీ నుంచి వెళ్లిపోయాయంటున్నారు. వీరిద్దరే కాదు.. మరి కొందరు కూడా అదే బాటలో ఉండడంతో సాగర్ ఉప ఎన్నిక కోసం ఏ మాత్రం కష్టపడలేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచే కొందరు కీలక నేతలు బీజేపీ వైపు చూస్తోన్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా సాగర్, తిరుపతి ఫలితాల తర్వాత మళ్లీ తెలుగు రాజకీయాలు వేడెక్కనున్నాయి.
This post was last modified on April 18, 2021 7:00 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…