హైదరాబాదులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేకత ఉంది. సుమారు 60 అడుగుల ఎత్తుతో కొలువు దీరి అందరి విఘ్నాలు పోగొట్టే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకే కరోనా విఘ్నం ఏర్పడింది. 1954 తర్వాత మొదటి సారి ఉత్సవాలపై సందేహాలు ఏర్పడ్డాయి.
కరోనా ఇపుడపుడే వదిలే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి వీడియో కాన్ఫరెన్సులో ఆగస్టు కల్లా వ్యాక్సిన్ కనిపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే… వ్యాక్సిన్ కనిపెట్టడం ఎంత ముఖ్యమో అది 130 కోట్ల భారతీయులకు అవసరమైనంత తయారుచేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ఆగస్టులో వినాయక ఉత్సవాలుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను భారీ సంఖ్యలో గుమిగూడటాన్ని ప్రభుత్వం వినాయకచవితికి కూడా అనుమతించదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్రపూజ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్సవ కమిటీ విగ్రహం ఎత్తు ఒక్క అడుగుకు పరిమితం చేసినట్లు పేర్కొంది.
మరో వైపు కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఇది పీక్స్ కి చేరి తగ్గుముఖం పట్టేదెన్నడో అర్థం కాని పరిస్థితి. అందుకే ఈ ఏడాది కేవలం ఒక్క అడుగు వినాయకుడిని ప్రతిష్టించాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఒకవేళ ఆగస్టుకు కరోనా ప్రభావం బాగా నెమ్మదించిన ఇప్పటిలా పెద్ద సంఖ్యలో జనం గుంపులుగుంపులుగా హాజరవడానికి అనుమతించరు.
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…
ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…