హైదరాబాదులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేకత ఉంది. సుమారు 60 అడుగుల ఎత్తుతో కొలువు దీరి అందరి విఘ్నాలు పోగొట్టే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకే కరోనా విఘ్నం ఏర్పడింది. 1954 తర్వాత మొదటి సారి ఉత్సవాలపై సందేహాలు ఏర్పడ్డాయి.
కరోనా ఇపుడపుడే వదిలే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి వీడియో కాన్ఫరెన్సులో ఆగస్టు కల్లా వ్యాక్సిన్ కనిపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే… వ్యాక్సిన్ కనిపెట్టడం ఎంత ముఖ్యమో అది 130 కోట్ల భారతీయులకు అవసరమైనంత తయారుచేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ఆగస్టులో వినాయక ఉత్సవాలుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను భారీ సంఖ్యలో గుమిగూడటాన్ని ప్రభుత్వం వినాయకచవితికి కూడా అనుమతించదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్రపూజ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్సవ కమిటీ విగ్రహం ఎత్తు ఒక్క అడుగుకు పరిమితం చేసినట్లు పేర్కొంది.
మరో వైపు కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఇది పీక్స్ కి చేరి తగ్గుముఖం పట్టేదెన్నడో అర్థం కాని పరిస్థితి. అందుకే ఈ ఏడాది కేవలం ఒక్క అడుగు వినాయకుడిని ప్రతిష్టించాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఒకవేళ ఆగస్టుకు కరోనా ప్రభావం బాగా నెమ్మదించిన ఇప్పటిలా పెద్ద సంఖ్యలో జనం గుంపులుగుంపులుగా హాజరవడానికి అనుమతించరు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…