Political News

మోడి సర్కార్ పక్షపాతంతో వ్యవహరిస్తోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కరోనావైరస్ టీకాలు వేయించుకోవాలని, నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్న కేంద్రప్రభుత్వం అందుకు అవసరమైన టీకాలను మాత్రం సరఫరా చేయటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తంమీద అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాత ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలున్నాయి.

చాలా వేగంగా కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న రాష్ట్రాలుగా ఏపి, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ నరేంద్రమోడిపై విరుచుకుపడ్డారు. ఎక్కువ కేసులు, మరణాలు నమోదవుతున్న మహారాష్ట్రకు వ్యాక్సిన్ పంపకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపించారు.

మహారాష్ట్ర ఆరోపణలో నిజం ఉందని బీజేపీయేతర రాష్ట్రాల మంత్రులు కూడా మద్దతుగా నిలబడ్డారు. దాంతో విషయం కాస్త రచ్చ రచ్చగా మారింది. దాంతో అప్పటికప్పుడు కేంద్రం మహారాష్ట్రకు వ్యాక్సిన్లను పంపిణీచేసింది. అంటే వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తున్న విషయం అర్ధమైపోయింది. ఏపికి 60 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని జగన్ పదే పదే కేంద్రాన్ని కోరుతున్నారు. అలాగే తెలంగాణాలో కూడా 25 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరమని వైద్యమంత్రి ఈటల రాజేందర్ కోరుతున్నారు.

ఒకవైపే బీజేపీయేతర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కోసం ఎంత మొత్తుకుంటున్న కేంద్రం డిమాండ్ కు తగ్గట్లు స్పందించటంలేదు. అదే సమయంలో తమ పాలిత రాష్ట్రాల విషయంలో మాత్రం వెంటనే స్పందిస్తోంది. ఇక్కడే నరేంద్రమోడి వ్యవహార శైలిపై గోల మొదలైంది. మనకే సరపడా వ్యాక్సిన్ సరఫరా లేనపుడు విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయటం ఏమిటంటు ప్రతిపక్షాలు మోడిపై మండిపోతున్నాయి. అయినా మోడి ఎవరినీ లెక్కచేయటంలేదు. చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.

This post was last modified on April 17, 2021 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మార్కో అంద‌రినీ చెడగొట్టేసాడా?

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి…

14 minutes ago

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

5 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

11 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

14 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

16 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

17 hours ago