తెలంగాణాలో ఇపుడందరి కళ్ళు వైఎస్ షర్మిల మీదే పడ్డాయి. తొందరలో జరగబోయే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటి ఎన్నికల విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఐదు మున్సిపాలిటిలు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, అచ్చంపేటతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఈనెల 30వ తేదీన ఎన్నిక జరగబోతోంది.
స్టేట్ ఎలక్షన్ కమీషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేయగానే ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైపోయింది. ఒకవైపు ఈనెల 17వ తేదీన జరగబోతున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల వేడి చల్లారుతుంది కదాని జనాలు అనుకున్నారు. అయితే హఠాత్తుగా గురువారం జారీ అయిన నోటిఫికేషన్తో ఎన్నికల వేడి మరికొన్ని రోజుల పాటు కంటిన్యు అవ్వక తప్పట్లేదు.
ఒకేసారి ఏడు మున్సిపాలిటల ఎన్నికలంటే మామూలు విషయం కాదు. కాబట్టి అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ఎటూ పోటీలో ఉంటాయి. అయితే తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని, 2023లో అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్న షర్మిల ఏమి చేయబోతున్నారన్నదే ప్రశ్నార్ధకమైంది. ఎందుకంటే షర్మిల ఇప్పటివరకు రాజకీయపార్టీని ప్రకటించలేదు. కాబట్టి ఎన్నికల సంఘం దగ్గర నమోదు కూడా చేసుకోలేదు.
అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు తెలంగాణాలో పెద్దసంఖ్యలో అభిమానులు, మద్దతుదారులున్నారు. వీరుకూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీనంగర్, గ్రేటర్ హైదరబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కేంద్రీకృతమయ్యారు. మున్సిపాలిటీల సంగతి ఎలాగున్నా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో పోటీ చేయాల్సిందే అని షర్మిల మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారట. ఈ ఎన్నికల్లో పోటీచేస్తేనే షర్మిల పెట్టబోయే రాజకీయపార్టీకి జనాల మద్దతు ఎంతుందనే విషయం ఓ ట్రైలర్ లాగ పనిచేస్తుంది. మరి చూడాలి షర్మిల ఏమి చేస్తారో.
This post was last modified on April 16, 2021 4:39 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…