తెలంగాణాలో ఇపుడందరి కళ్ళు వైఎస్ షర్మిల మీదే పడ్డాయి. తొందరలో జరగబోయే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటి ఎన్నికల విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఐదు మున్సిపాలిటిలు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, అచ్చంపేటతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఈనెల 30వ తేదీన ఎన్నిక జరగబోతోంది.
స్టేట్ ఎలక్షన్ కమీషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేయగానే ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైపోయింది. ఒకవైపు ఈనెల 17వ తేదీన జరగబోతున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల వేడి చల్లారుతుంది కదాని జనాలు అనుకున్నారు. అయితే హఠాత్తుగా గురువారం జారీ అయిన నోటిఫికేషన్తో ఎన్నికల వేడి మరికొన్ని రోజుల పాటు కంటిన్యు అవ్వక తప్పట్లేదు.
ఒకేసారి ఏడు మున్సిపాలిటల ఎన్నికలంటే మామూలు విషయం కాదు. కాబట్టి అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ఎటూ పోటీలో ఉంటాయి. అయితే తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని, 2023లో అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్న షర్మిల ఏమి చేయబోతున్నారన్నదే ప్రశ్నార్ధకమైంది. ఎందుకంటే షర్మిల ఇప్పటివరకు రాజకీయపార్టీని ప్రకటించలేదు. కాబట్టి ఎన్నికల సంఘం దగ్గర నమోదు కూడా చేసుకోలేదు.
అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు తెలంగాణాలో పెద్దసంఖ్యలో అభిమానులు, మద్దతుదారులున్నారు. వీరుకూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీనంగర్, గ్రేటర్ హైదరబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కేంద్రీకృతమయ్యారు. మున్సిపాలిటీల సంగతి ఎలాగున్నా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో పోటీ చేయాల్సిందే అని షర్మిల మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారట. ఈ ఎన్నికల్లో పోటీచేస్తేనే షర్మిల పెట్టబోయే రాజకీయపార్టీకి జనాల మద్దతు ఎంతుందనే విషయం ఓ ట్రైలర్ లాగ పనిచేస్తుంది. మరి చూడాలి షర్మిల ఏమి చేస్తారో.
This post was last modified on April 16, 2021 4:39 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…