Peddi Reddy
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ లక్ష్యంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వైసీపీ టార్గెట్ ఇక్కడ 5 లక్షల ఓట్లని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీ నేతలకు, మంత్రులకు 5 లక్షల టార్గెట్ విధించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనగా.. మరో వంద మంది ఎమ్మెల్యేలు.. పరోక్షంగా ప్రచార పర్వంలో ప్రధాన భూమిక వహించారు.
అయితే.. తాజాగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. 5 లక్షల మెజారిటీ తమకు పెద్ద విషయం కాదని వ్యాఖ్యా నించారు. ఓటింగ్ పెరిగితే.. తమకు 6 లక్షల నుంచి ఆరున్నర లక్షల వరకు ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చారు. తమ రెండేళ్ల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పుకొచ్చిన ఆయన.. ప్రచార పర్వం ఘనంగా సాగిందని.. ఎక్కడా తాము ఎవరినీ ప్రలోభాలకు గురి చేయలేదని, అలాంటి అవసరం కూడా తమకు లేదని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రబాబు సభపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. రాళ్లు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
అదేవిధంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా సత్యవేడులో నిర్వహించిన సభలో బుధవారం కరెంట్ కట్ చేశారనే వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఆ సంస్కృతి తమకు లేదని.. ఆధారాలు ఉంటే సమర్పించాలని.. చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోముఖ్యమైన అంశం.. వలంటీర్లను ఎన్నికల విధుల కోసం వినియోగించుకుంటున్నారనే ఆరోపణలపై స్పందించిన మంత్రి… ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న వలంటీర్లను వినియోగించాల్సిన అవసరం కూడా తమకు లేదని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ?
అయితే.. మంత్రి పెద్దిరెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేయడం గమనార్హం. వీటిలో ప్రధానంగా ఇటీవల తిరుపతి ప్రజలకు సీఎం జగన్ రాసిన లేఖలను వలంటీర్లు ఎందుకు పంచిపెట్టారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వెళ్లి వారినే అడగాలని అన్నారు.
This post was last modified on April 15, 2021 6:02 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…