రాజకీయనేతలకు ఉండాల్సిన ముఖ్య లక్షణం పదిమందిని కలుపుకునే పోవటం. ఎంతమంది మిత్రులను చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాలు అంత ప్రశాంతంగా ఉంటుంది. రేపు ఎన్నికల సమయంలో ఒంటరిపోరాటం చేసేకన్నా నలుగురితో పొత్తలు పెట్టుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారు. కాబట్టి మిత్రపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా టాక్ ఆఫ్ ది తెలంగాణా అవుతున్న షర్మిల గురించే.
ఉద్యోగుల భర్తీ డిమాండ్ తో నిరాహార దీక్ష చేయటానికి పోలీసులు వైఎస్ షర్మిలకు అనుమతించారు. అంటే గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు దగ్గర షర్మిల నిరాహార దీక్ష చేయనున్నారు. మూడు రోజుల దీక్షకు అనుమతి అడిగితే ప్రస్తుత కరోనా వైరస్ తదితరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు.
ఇక్కడ గమనించాల్సిందిగా దీక్ష ఒక్కరోజా లేకపోతే మూడు రోజులా అనికాదు. షర్మిల చేయబోయే దీక్షలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ? అన్నదే కీలకమైంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రముఖ ప్రజ గాయకుడు గద్దర్ తో పాటు అనేకమందికి షర్మిల తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పేరుపేరున లేఖలు రాశారు. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేయబోయే దీక్షకు మద్దతుగా వచ్చి తనకు సంఘీభావం చెప్పాల్సిందిగా షర్మిల లేఖల్లో కోరారు.
కేసీయార్ వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీనే చేయలేదని వామపక్షాలు, నిరుద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ఎన్నో వేదికలపై సీఎంను పదే పదే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి షర్మిల చేయబోయే దీక్షలో ఎంతమంది మద్దతుగా నిలబడతారో ? ఎంతమంది దీక్షలో పాల్గొని సంఘీభావం చెబుతారో తేలిపోతుంది. అంటే దీక్షలో షర్మిలకు మద్దతు ఇచ్చే వాళ్ళని బట్టి భవిష్యత్తులో షర్మిలతో చేతులు కలపేదెవరో తేలిపోతుంది.
This post was last modified on April 15, 2021 11:24 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…