రాజకీయనేతలకు ఉండాల్సిన ముఖ్య లక్షణం పదిమందిని కలుపుకునే పోవటం. ఎంతమంది మిత్రులను చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాలు అంత ప్రశాంతంగా ఉంటుంది. రేపు ఎన్నికల సమయంలో ఒంటరిపోరాటం చేసేకన్నా నలుగురితో పొత్తలు పెట్టుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారు. కాబట్టి మిత్రపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా టాక్ ఆఫ్ ది తెలంగాణా అవుతున్న షర్మిల గురించే.
ఉద్యోగుల భర్తీ డిమాండ్ తో నిరాహార దీక్ష చేయటానికి పోలీసులు వైఎస్ షర్మిలకు అనుమతించారు. అంటే గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు దగ్గర షర్మిల నిరాహార దీక్ష చేయనున్నారు. మూడు రోజుల దీక్షకు అనుమతి అడిగితే ప్రస్తుత కరోనా వైరస్ తదితరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు.
ఇక్కడ గమనించాల్సిందిగా దీక్ష ఒక్కరోజా లేకపోతే మూడు రోజులా అనికాదు. షర్మిల చేయబోయే దీక్షలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ? అన్నదే కీలకమైంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రముఖ ప్రజ గాయకుడు గద్దర్ తో పాటు అనేకమందికి షర్మిల తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పేరుపేరున లేఖలు రాశారు. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేయబోయే దీక్షకు మద్దతుగా వచ్చి తనకు సంఘీభావం చెప్పాల్సిందిగా షర్మిల లేఖల్లో కోరారు.
కేసీయార్ వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీనే చేయలేదని వామపక్షాలు, నిరుద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ఎన్నో వేదికలపై సీఎంను పదే పదే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి షర్మిల చేయబోయే దీక్షలో ఎంతమంది మద్దతుగా నిలబడతారో ? ఎంతమంది దీక్షలో పాల్గొని సంఘీభావం చెబుతారో తేలిపోతుంది. అంటే దీక్షలో షర్మిలకు మద్దతు ఇచ్చే వాళ్ళని బట్టి భవిష్యత్తులో షర్మిలతో చేతులు కలపేదెవరో తేలిపోతుంది.
This post was last modified on April 15, 2021 11:24 am
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…