Political News

బాబును కాద‌న్నారు.. మీరేం చేశారు జ‌గ‌న్‌.. ద‌ళితుల ప్ర‌శ్న‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ద‌ళిత సామాజిక వ‌ర్గాల ‌నుంచి సూటి ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. “మీరు ఇచ్చిన హామీ.. ఏమైంది సార్‌?” అంటూ వారు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ఒక్క ద‌ళితులే కాదు.. మేధావుల నుంచి కూడా ఈ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇప్పుడు ద‌ళితులు నిల‌దీస్తున్నారు? ఏంటి ప్ర‌త్యేక‌త‌? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఐన‌వోలు గ్రామంలో గ‌తంలో చంద్ర‌బాబు ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించిన ‘అంబేడ్క‌ర్ స్మృతి వ‌నం’ను జ‌గ‌న్ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

దాదాపు 100 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో.. రాజ‌ధాని ప‌రిధిలోని ఐన‌వోలు గ్రామంలో చంద్ర‌బాబు అంబేడ్కర్ స్మృతి వ‌నం ఏర్పాటుకు శంకుస్థాప‌న చేశారు. అంబేడ్క‌ర్ 125వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 14, 2016న దాదాపు 126 అడుగుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేలా.. ఆయ‌న ప్లాన్ చేసుకుని ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. దీనికి సంబంధించి పాతిక కోట్లు ఇచ్చారు. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు అధికారం నుంచి దిగిపోయారు. ఇక‌, జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. గ‌త ఏడాది ఈ స్మృతి వ‌నాన్ని ర‌ద్దు చేశారు. అది కూడా అంబేడ్క‌ర్ జ‌యంతి రోజే నిర్ణ‌యం తీసుకున్నారు. అదేస‌మ‌యంలో గ‌త ఏడాది ఏప్రిల్ 14న వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌క‌ట‌న మేర‌కు విజ‌య‌వాడ న‌డి బొడ్డున పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. మంత్రి పినిపే విశ్వ‌రూప్ ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. హుటాహుటిన‌.. శంకుస్థాప‌న కూడా చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న‌(అంటే.. 2021, ఏప్రిల్ 14) అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తామ‌ని.. ఆనాడు వైసీపీ అధినేత స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ, ఇది పూర్తిగా విఫ‌ల‌మైంది. పీడ‌బ్ల్యుడీగ్రౌండ్ లో వివాదాస్ప‌ద ప్రాంతంలో నిర్మాణం సాగిస్తున్నార‌ని కొంద‌రు కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ఈ క్ర‌మంలో ద‌ళితులు, మేదావులు ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. “ఏమైంది జ‌గ‌న్‌?” అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు కురిపించారు.

ఏదైనా చెడగొట్ట‌డం.. ప‌డ‌గొట్ట‌డం తేలికేన‌ని.. నిర్మించ‌డ‌మే క‌ష్ట‌మ‌ని కూడా వ్యాఖ్య‌లు సందించారు. అంబేడ్క‌ర్ 130వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సీఎం జ‌గ‌న్ అంబేడ్క‌ర్‌కు నివాళి అయితే.. అర్పించారు కానీ, విజ‌య‌వాడ‌లో తాము ఇదే రోజు ప్రారంభిస్తామ‌ని చెప్పిన అంబేడ్క‌ర్ పార్క్‌పై మాత్రం ఒక్క‌మాట ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని ఏమంటారో.. ఆయ‌నే చెప్పాల‌ని అంటున్నారు మేధావులుసైతం. మ‌రి వైసీపీ నేత‌లు ఏం చెబుతారో చూడాలి.

This post was last modified on April 15, 2021 7:11 am

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

2 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

7 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

11 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

13 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

13 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

14 hours ago