Political News

బాబును కాద‌న్నారు.. మీరేం చేశారు జ‌గ‌న్‌.. ద‌ళితుల ప్ర‌శ్న‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ద‌ళిత సామాజిక వ‌ర్గాల ‌నుంచి సూటి ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. “మీరు ఇచ్చిన హామీ.. ఏమైంది సార్‌?” అంటూ వారు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ఒక్క ద‌ళితులే కాదు.. మేధావుల నుంచి కూడా ఈ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇప్పుడు ద‌ళితులు నిల‌దీస్తున్నారు? ఏంటి ప్ర‌త్యేక‌త‌? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఐన‌వోలు గ్రామంలో గ‌తంలో చంద్ర‌బాబు ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించిన ‘అంబేడ్క‌ర్ స్మృతి వ‌నం’ను జ‌గ‌న్ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

దాదాపు 100 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో.. రాజ‌ధాని ప‌రిధిలోని ఐన‌వోలు గ్రామంలో చంద్ర‌బాబు అంబేడ్కర్ స్మృతి వ‌నం ఏర్పాటుకు శంకుస్థాప‌న చేశారు. అంబేడ్క‌ర్ 125వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 14, 2016న దాదాపు 126 అడుగుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేలా.. ఆయ‌న ప్లాన్ చేసుకుని ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. దీనికి సంబంధించి పాతిక కోట్లు ఇచ్చారు. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు అధికారం నుంచి దిగిపోయారు. ఇక‌, జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. గ‌త ఏడాది ఈ స్మృతి వ‌నాన్ని ర‌ద్దు చేశారు. అది కూడా అంబేడ్క‌ర్ జ‌యంతి రోజే నిర్ణ‌యం తీసుకున్నారు. అదేస‌మ‌యంలో గ‌త ఏడాది ఏప్రిల్ 14న వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌క‌ట‌న మేర‌కు విజ‌య‌వాడ న‌డి బొడ్డున పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. మంత్రి పినిపే విశ్వ‌రూప్ ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. హుటాహుటిన‌.. శంకుస్థాప‌న కూడా చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న‌(అంటే.. 2021, ఏప్రిల్ 14) అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తామ‌ని.. ఆనాడు వైసీపీ అధినేత స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ, ఇది పూర్తిగా విఫ‌ల‌మైంది. పీడ‌బ్ల్యుడీగ్రౌండ్ లో వివాదాస్ప‌ద ప్రాంతంలో నిర్మాణం సాగిస్తున్నార‌ని కొంద‌రు కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ఈ క్ర‌మంలో ద‌ళితులు, మేదావులు ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. “ఏమైంది జ‌గ‌న్‌?” అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు కురిపించారు.

ఏదైనా చెడగొట్ట‌డం.. ప‌డ‌గొట్ట‌డం తేలికేన‌ని.. నిర్మించ‌డ‌మే క‌ష్ట‌మ‌ని కూడా వ్యాఖ్య‌లు సందించారు. అంబేడ్క‌ర్ 130వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సీఎం జ‌గ‌న్ అంబేడ్క‌ర్‌కు నివాళి అయితే.. అర్పించారు కానీ, విజ‌య‌వాడ‌లో తాము ఇదే రోజు ప్రారంభిస్తామ‌ని చెప్పిన అంబేడ్క‌ర్ పార్క్‌పై మాత్రం ఒక్క‌మాట ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని ఏమంటారో.. ఆయ‌నే చెప్పాల‌ని అంటున్నారు మేధావులుసైతం. మ‌రి వైసీపీ నేత‌లు ఏం చెబుతారో చూడాలి.

This post was last modified on April 15, 2021 7:11 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

45 minutes ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

58 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

1 hour ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

2 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

3 hours ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

3 hours ago