ఏపీ సీఎం జగన్కు దళిత సామాజిక వర్గాల నుంచి సూటి ప్రశ్న తెరమీదికి వచ్చింది. “మీరు ఇచ్చిన హామీ.. ఏమైంది సార్?” అంటూ వారు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఒక్క దళితులే కాదు.. మేధావుల నుంచి కూడా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు దళితులు నిలదీస్తున్నారు? ఏంటి ప్రత్యేకత? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. రాజధాని అమరావతిలోని ఐనవోలు గ్రామంలో గతంలో చంద్రబాబు ఏర్పాటు చేయాలని సంకల్పించిన ‘అంబేడ్కర్ స్మృతి వనం’ను జగన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో.. రాజధాని పరిధిలోని ఐనవోలు గ్రామంలో చంద్రబాబు అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14, 2016న దాదాపు 126 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా.. ఆయన ప్లాన్ చేసుకుని ఇదే విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి పాతిక కోట్లు ఇచ్చారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయారు. ఇక, జగన్ వచ్చిన తర్వాత.. గత ఏడాది ఈ స్మృతి వనాన్ని రద్దు చేశారు. అది కూడా అంబేడ్కర్ జయంతి రోజే నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో గత ఏడాది ఏప్రిల్ 14న వైసీపీ అధినేత సీఎం జగన్.. ప్రకటన మేరకు విజయవాడ నడి బొడ్డున పీడబ్ల్యుడీ గ్రౌండ్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని.. మంత్రి పినిపే విశ్వరూప్ ప్రకటించారు.
అంతేకాదు.. హుటాహుటిన.. శంకుస్థాపన కూడా చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న(అంటే.. 2021, ఏప్రిల్ 14) అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని.. ఆనాడు వైసీపీ అధినేత స్వయంగా ప్రకటించారు. కానీ, ఇది పూర్తిగా విఫలమైంది. పీడబ్ల్యుడీగ్రౌండ్ లో వివాదాస్పద ప్రాంతంలో నిర్మాణం సాగిస్తున్నారని కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో దళితులు, మేదావులు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. “ఏమైంది జగన్?” అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపించారు.
ఏదైనా చెడగొట్టడం.. పడగొట్టడం తేలికేనని.. నిర్మించడమే కష్టమని కూడా వ్యాఖ్యలు సందించారు. అంబేడ్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ అంబేడ్కర్కు నివాళి అయితే.. అర్పించారు కానీ, విజయవాడలో తాము ఇదే రోజు ప్రారంభిస్తామని చెప్పిన అంబేడ్కర్ పార్క్పై మాత్రం ఒక్కమాట ఎత్తకపోవడం గమనార్హం. మరి దీనిని ఏమంటారో.. ఆయనే చెప్పాలని అంటున్నారు మేధావులుసైతం. మరి వైసీపీ నేతలు ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on April 15, 2021 7:11 am
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…