Political News

వైసీపీ లోపాలు.. టీడీపీకి ప్ల‌స్‌లు.. విష‌యం ఏంటంటే…!


తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. ఎన్నిక‌ల నోటి ఫికేష‌న్‌కు ముందుగానే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంతోపాటు.. ఇప్పుడు ప్ర‌చారాన్ని కూడా ఉధృతం చేసింది. అయితే.. ఒక‌వైపు ప్ర‌చారంతోను.. మ‌రోవైపు అధికార పార్టీలోని లోపాల‌ను కూడా త‌న‌కు ప్ల‌స్‌లుగా మార్చుకుని.. ముందుకు సాగుతోంది.. టీడీపీ. సీఎం జ‌గ‌న్ ముందుకు ఇక్క‌డ ప్ర‌చారానికి వ‌స్తాన‌ని చెప్పి.. త‌ర్వాత క‌రోనా పేరుతో వెనుక‌డుగు వేశారు. దీనిని చంద్ర‌బాబు ఎత్తి చూపుతున్నారు. క‌రోనా నిజ‌మే అయితే.. వ‌లంటీర్ల‌తో వేలాది మందిని పోగేసి .. స‌త్కారాలు ఎలా చేశారంటూ.. ఆయ‌న ప్ర‌శ్నించారు.

అదే స‌మ‌యంలో వైఎస్ వివాకా హ‌త్య కేసును ప‌న‌రిశోధించ‌డంలోను, నిందితుల‌ను ప‌ట్టుకోలేక పోవ‌డాన్ని కూడా చంద్ర‌బాబు.. తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఇవ‌న్నీ.. పైకి క‌నిపిస్తున్న‌వి. కానీ, క‌నిపించ‌ని ప్ల‌స్‌లు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీలో గ్రూప్‌ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఆశించి చాలామంది నేతలు భంగపడ్డారు. వారంతా ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో వీరంతా పార్టీ కోసం పనిచేయ‌డం లేద‌నేది వాస్త‌వం. ఇది.. టీడీపీకి ప్ల‌స్‌గా మారింది.

ఇక ప్ర‌చారంలో కూడా మంత్రులు ఉంటేనే నాయ‌కులు క‌నిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్ర‌చారం చేస్తున్న చోట కీల‌క నేత‌లు ముందుకు సాగ‌డం లేదు. దీంతో వైసీపీ అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. టీడీపీకి మేలు చేస్తాయ‌ని ఆ పార్టీ కీల‌క నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించడంతో.. ప్రజలకు పెద్దగా తెలియని ఆయనకు ఓట్లు వేస్తారా? అనేది కూడా టీడీపీకి క‌లిసివ‌స్తోంది. ఇక టీడీపీ అభ్య‌ర్థి పనబాక లక్ష్మి నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు కావ‌డం.. చాలాకాలంగా రాజకీయాల్లో ఉండటం టీడీపీకి ప్లస్ పాయింట్‌గా మారింది.

ఇక‌, వైసీపీ నుంచి ఎవ‌రూ పెద్ద‌గా కీల‌క నేత‌లు రంగంలోకి రాలేదు. ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించిన మంత్రులే ప్ర‌చారం చేస్తున్నారు. వీరిలో కూడా కొంద‌రు డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ… టీడీపీ నుంచి ఏకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగ‌డం మ‌రింత ప్ల‌స్‌గా మారింది. లోకేష్ కూడా అక్క‌డే మ‌కాం వేసి మ‌రి ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో నెల‌కొన్న వ్య‌తిరేక ప‌రిణామాలు త‌మ‌కు అనుకూలంగా మార‌తాయ‌ని.. టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏమేర‌కు వీరి అంచ‌నాలు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on April 14, 2021 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

24 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

4 hours ago

అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…

6 hours ago