Political News

వైసీపీ లోపాలు.. టీడీపీకి ప్ల‌స్‌లు.. విష‌యం ఏంటంటే…!


తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. ఎన్నిక‌ల నోటి ఫికేష‌న్‌కు ముందుగానే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంతోపాటు.. ఇప్పుడు ప్ర‌చారాన్ని కూడా ఉధృతం చేసింది. అయితే.. ఒక‌వైపు ప్ర‌చారంతోను.. మ‌రోవైపు అధికార పార్టీలోని లోపాల‌ను కూడా త‌న‌కు ప్ల‌స్‌లుగా మార్చుకుని.. ముందుకు సాగుతోంది.. టీడీపీ. సీఎం జ‌గ‌న్ ముందుకు ఇక్క‌డ ప్ర‌చారానికి వ‌స్తాన‌ని చెప్పి.. త‌ర్వాత క‌రోనా పేరుతో వెనుక‌డుగు వేశారు. దీనిని చంద్ర‌బాబు ఎత్తి చూపుతున్నారు. క‌రోనా నిజ‌మే అయితే.. వ‌లంటీర్ల‌తో వేలాది మందిని పోగేసి .. స‌త్కారాలు ఎలా చేశారంటూ.. ఆయ‌న ప్ర‌శ్నించారు.

అదే స‌మ‌యంలో వైఎస్ వివాకా హ‌త్య కేసును ప‌న‌రిశోధించ‌డంలోను, నిందితుల‌ను ప‌ట్టుకోలేక పోవ‌డాన్ని కూడా చంద్ర‌బాబు.. తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఇవ‌న్నీ.. పైకి క‌నిపిస్తున్న‌వి. కానీ, క‌నిపించ‌ని ప్ల‌స్‌లు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీలో గ్రూప్‌ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఆశించి చాలామంది నేతలు భంగపడ్డారు. వారంతా ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో వీరంతా పార్టీ కోసం పనిచేయ‌డం లేద‌నేది వాస్త‌వం. ఇది.. టీడీపీకి ప్ల‌స్‌గా మారింది.

ఇక ప్ర‌చారంలో కూడా మంత్రులు ఉంటేనే నాయ‌కులు క‌నిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్ర‌చారం చేస్తున్న చోట కీల‌క నేత‌లు ముందుకు సాగ‌డం లేదు. దీంతో వైసీపీ అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. టీడీపీకి మేలు చేస్తాయ‌ని ఆ పార్టీ కీల‌క నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించడంతో.. ప్రజలకు పెద్దగా తెలియని ఆయనకు ఓట్లు వేస్తారా? అనేది కూడా టీడీపీకి క‌లిసివ‌స్తోంది. ఇక టీడీపీ అభ్య‌ర్థి పనబాక లక్ష్మి నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు కావ‌డం.. చాలాకాలంగా రాజకీయాల్లో ఉండటం టీడీపీకి ప్లస్ పాయింట్‌గా మారింది.

ఇక‌, వైసీపీ నుంచి ఎవ‌రూ పెద్ద‌గా కీల‌క నేత‌లు రంగంలోకి రాలేదు. ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించిన మంత్రులే ప్ర‌చారం చేస్తున్నారు. వీరిలో కూడా కొంద‌రు డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ… టీడీపీ నుంచి ఏకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగ‌డం మ‌రింత ప్ల‌స్‌గా మారింది. లోకేష్ కూడా అక్క‌డే మ‌కాం వేసి మ‌రి ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో నెల‌కొన్న వ్య‌తిరేక ప‌రిణామాలు త‌మ‌కు అనుకూలంగా మార‌తాయ‌ని.. టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏమేర‌కు వీరి అంచ‌నాలు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on April 14, 2021 3:12 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

8 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

54 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago