వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ తరహా పరిస్థితి తప్పిందంటే.. కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలో కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ నేతలు.. తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అనగానే.. అప్పటి పరిస్థితిలో అంటే.. నెల కిందటి పరిస్థితిలో సీఎం జగన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ గెలుపు ముఖ్యం కాదని.. ఐదు లక్షల మెజారిటీ సాధించాలని లక్ష్మణ రేఖ గీశారు. అంతేకాదు, ఈ బాధ్యతను కీలక మంద్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి అనిల్పైనే మోపారు. నిజానికి ముందు ఈ మంత్రులు.. కూడా ఈ టార్గెట్ను లైట్ తీసుకున్నారు. ఆ.. ఇదెంత అనుకున్నారు. వాస్తవానికి అప్పటి పరిస్థితిని బట్టి.. ఈ మాత్రం మెజారిటీ సాధ్యమేనని అనుకున్నారు.కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిణామాలు మారుతుండడం.. వాస్తవాలు కళ్లముందుకు వస్తుండడంతో సీనియర్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఐదు లక్షల మెజారిటీ సాధన సాధ్యమేనా? అనే సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అంచనాలు దక్కకపోవడానికి కారణాలు ఇవే..
This post was last modified on April 14, 2021 5:16 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…