Political News

క్యాండెట్లో స‌త్తా లేదు… అంత మెజార్టీ వ‌స్తుందా ?

వ్య‌క్తిగ‌త జీవితంలో అయినా.. రాజ‌కీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచ‌నాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బ‌ట్టే.. ఒక లెక్క‌కు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్క‌డైనా.. ఈ త‌ర‌హా ప‌రిస్థితి త‌ప్పిందంటే.. క‌ష్ట‌మే! ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. అధికార వైసీపీలో క‌నిపిస్తోంది. తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు సంబంధించి అధికార పార్టీ నేత‌లు.. త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతున్నారు. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక అన‌గానే.. అప్ప‌టి ప‌రిస్థితిలో అంటే.. నెల కింద‌టి ప‌రిస్థితిలో సీఎం జ‌గ‌న్‌.. అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక్క‌డ గెలుపు ముఖ్యం కాద‌ని.. ఐదు ల‌క్ష‌ల మెజారిటీ సాధించాల‌ని ల‌క్ష్మ‌ణ రేఖ గీశారు. అంతేకాదు, ఈ బాధ్య‌త‌ను కీల‌క మంద్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మ‌రో మంత్రి అనిల్‌పైనే మోపారు. నిజానికి ముందు ఈ మంత్రులు.. కూడా ఈ టార్గెట్‌ను లైట్ తీసుకున్నారు. ఆ.. ఇదెంత అనుకున్నారు. వాస్త‌వానికి అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి.. ఈ మాత్రం మెజారిటీ సాధ్య‌మేన‌ని అనుకున్నారు.కానీ, రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఇక్క‌డి ప‌రిణామాలు మారుతుండ‌డం.. వాస్త‌వాలు క‌ళ్ల‌ముందుకు వ‌స్తుండ‌డంతో సీనియ‌ర్ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఐదు ల‌క్ష‌ల మెజారిటీ సాధ‌న సాధ్య‌మేనా? అనే సందేహాలు వారిలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వైసీపీ అంచ‌నాలు ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఇవే..

  • అధికార పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి రాజ‌కీయాల‌కు కొత్త కావ‌డం
  • గురుమూర్తికి-తిరుప‌తికి మ‌ధ్య సంబంధాలు లేక‌పోవ‌డం
  • వైసీపీపై సానుభూతి ప‌వ‌నాలు.. గ‌తంలో కంటే త‌క్కువ‌గా ఉండ‌డం
  • రెండేళ్ల పాల‌న‌లో ప్ర‌భుత్వం అమలు చేస్తున్న న‌వ‌ర‌త్నాలు కొంద‌రికే ద‌క్కుతుండ‌డం
  • సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. మిగిలిన జిల్లాల్లో లేక పోవ‌డం
  • క‌డ‌ప‌లో వ‌చ్చిన మెజారిటీని ఇక్క‌డ సాధించేందుకు అవ‌కాశాలు లేక‌పోవ‌డం
  • హిందూ ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులు
  • తిరుపతిలో వైసీపీ చనిపోయిన సిట్టింగ్ ఎంపీకి చాన్సివ్వలేదు.(దీనిని టీడీపీ వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తోంది)
  • ప్ర‌తిప‌క్షాలకు స్థానికంలో తీవ్ర ఎదురు దెబ్బ‌త‌గిలిన నేప‌థ్యంలో వాటిని వైసీపీ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం
  • ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు జోరుగా ప్ర‌చారం చేస్తుండ‌డం
  • తాజాగా బీజేపీ నేత‌లు అవినీతి అంటూ.. జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారానికి దిగ‌డం
    …. ఇలా.. అనేక కార‌ణాలు.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌కు ఇబ్బందిగా మారాయి. గెలుపు సాధ్య‌మే అయినా.. వారు అనుకున్న, ల‌క్ష్యంగా పెట్టుకున్న ఐదు ల‌క్ష‌ల మెజారిటీ సాధించ‌లేక పోతే.. ఇబ్బందే అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 14, 2021 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago