వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ తరహా పరిస్థితి తప్పిందంటే.. కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలో కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ నేతలు.. తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అనగానే.. అప్పటి పరిస్థితిలో అంటే.. నెల కిందటి పరిస్థితిలో సీఎం జగన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ గెలుపు ముఖ్యం కాదని.. ఐదు లక్షల మెజారిటీ సాధించాలని లక్ష్మణ రేఖ గీశారు. అంతేకాదు, ఈ బాధ్యతను కీలక మంద్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి అనిల్పైనే మోపారు. నిజానికి ముందు ఈ మంత్రులు.. కూడా ఈ టార్గెట్ను లైట్ తీసుకున్నారు. ఆ.. ఇదెంత అనుకున్నారు. వాస్తవానికి అప్పటి పరిస్థితిని బట్టి.. ఈ మాత్రం మెజారిటీ సాధ్యమేనని అనుకున్నారు.కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిణామాలు మారుతుండడం.. వాస్తవాలు కళ్లముందుకు వస్తుండడంతో సీనియర్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఐదు లక్షల మెజారిటీ సాధన సాధ్యమేనా? అనే సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అంచనాలు దక్కకపోవడానికి కారణాలు ఇవే..
This post was last modified on April 14, 2021 5:16 pm
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…