పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో ఏం జరుగుతోంది ? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి ? వచ్చే ఎన్నికల నాటికైనా అధికారం లోకి వస్తుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ రాజకీయ నేతల మధ్య హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకు డు.. మాదాసు గంగాధరం ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇది ఎక్కడైనా సహజమే. నచ్చని పరిస్థితుల నేపథ్యంలో ఏ నేతైనా.. సదరు పార్టీకి రాజీనామా సమర్పించడం ఎక్కడైనా ఉన్నదే. గతంలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేన పార్టీకి రిజైన్ చేశారు. సో.. ఇప్పుడు జరిగింది కూడా ఇదే బాపతు అని సరిపెట్టుకోవచ్చు.
కానీ.. పోతూ పోతూ.. ఆ నాడు.. జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు మాదాసు గంగాధరం కూడా కొన్ని కీలక ప్రశ్నలు మిగిల్చారు. రాజకీయ తెరమీదకి ఆయా ప్రశ్నలను సంధించారు. దీంతో ఇప్పుడు అసలు జనసేనలో ఏం జరుగుతోంది? ఎందుకు నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు? అసలు పార్టీలో ఎవరూ చేరకపోగా.. ఉన్నవారిని కూడా పవన్ ఎందుకు నిలబెట్టుకోలేక పోతున్నారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ పార్టీ తీరు, తెన్నులు చూస్తుంటే జనసేన అసలు రాజకీయ పార్టీగా నిలదొక్కుకుంటుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
ఇక అనేకానేక ఆన్సర్లు లేని ప్రశ్నలు కూడా జనసేన కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా పుంజుకుంటుందా ? అన్న సందేహాలు మేథావులు లేవనెత్తుతున్నారు. ఇప్పటివరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదు.. అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలు వేయలేదు. ఇవి ఎప్పటకి పూర్తవుతాయో ? తెలియదు. ఇక పార్టీ సభ్యత్వం, గ్రామ కమిటీల ఏర్పాటు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో క్రియాశీల సభ్యత్వం ఎలా చేయిస్తారో తెలియడం లేదు. ఇక ఇప్పటకీ పార్టీ విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఉందా లేదా ? అన్నదానిపై ఇప్పటకీ సరైన క్లారిటీ లేదు.
సినిమా ప్రపంచం వేరు.. రాజకీయ ప్రపంచం వేరు. దీనిపై సమాధానం లేదు.. సీనియర్లు పవన్తో కలిసి పని చేయలేని పరిస్థితి ఉంది. జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదన్న విమర్శలకు పవన్ ఇప్పటకీ ఆన్సర్ చేయలేకపోతున్నారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేశారన్న టాక్ ఉండనే ఉంది. మరి వీటిని పవన్ సమాధానం ఏం చేబుతారో చూడాలి. వీటిని పవన్ రివైజ్ చేసుకుని రియలైజ్ అయితేనే జనసేనకు కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా భవిష్యత్తు ఉంటుంది.
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…