పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో ఏం జరుగుతోంది ? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి ? వచ్చే ఎన్నికల నాటికైనా అధికారం లోకి వస్తుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ రాజకీయ నేతల మధ్య హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకు డు.. మాదాసు గంగాధరం ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇది ఎక్కడైనా సహజమే. నచ్చని పరిస్థితుల నేపథ్యంలో ఏ నేతైనా.. సదరు పార్టీకి రాజీనామా సమర్పించడం ఎక్కడైనా ఉన్నదే. గతంలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేన పార్టీకి రిజైన్ చేశారు. సో.. ఇప్పుడు జరిగింది కూడా ఇదే బాపతు అని సరిపెట్టుకోవచ్చు.
కానీ.. పోతూ పోతూ.. ఆ నాడు.. జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు మాదాసు గంగాధరం కూడా కొన్ని కీలక ప్రశ్నలు మిగిల్చారు. రాజకీయ తెరమీదకి ఆయా ప్రశ్నలను సంధించారు. దీంతో ఇప్పుడు అసలు జనసేనలో ఏం జరుగుతోంది? ఎందుకు నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు? అసలు పార్టీలో ఎవరూ చేరకపోగా.. ఉన్నవారిని కూడా పవన్ ఎందుకు నిలబెట్టుకోలేక పోతున్నారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ పార్టీ తీరు, తెన్నులు చూస్తుంటే జనసేన అసలు రాజకీయ పార్టీగా నిలదొక్కుకుంటుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
ఇక అనేకానేక ఆన్సర్లు లేని ప్రశ్నలు కూడా జనసేన కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా పుంజుకుంటుందా ? అన్న సందేహాలు మేథావులు లేవనెత్తుతున్నారు. ఇప్పటివరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదు.. అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలు వేయలేదు. ఇవి ఎప్పటకి పూర్తవుతాయో ? తెలియదు. ఇక పార్టీ సభ్యత్వం, గ్రామ కమిటీల ఏర్పాటు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో క్రియాశీల సభ్యత్వం ఎలా చేయిస్తారో తెలియడం లేదు. ఇక ఇప్పటకీ పార్టీ విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఉందా లేదా ? అన్నదానిపై ఇప్పటకీ సరైన క్లారిటీ లేదు.
సినిమా ప్రపంచం వేరు.. రాజకీయ ప్రపంచం వేరు. దీనిపై సమాధానం లేదు.. సీనియర్లు పవన్తో కలిసి పని చేయలేని పరిస్థితి ఉంది. జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదన్న విమర్శలకు పవన్ ఇప్పటకీ ఆన్సర్ చేయలేకపోతున్నారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేశారన్న టాక్ ఉండనే ఉంది. మరి వీటిని పవన్ సమాధానం ఏం చేబుతారో చూడాలి. వీటిని పవన్ రివైజ్ చేసుకుని రియలైజ్ అయితేనే జనసేనకు కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా భవిష్యత్తు ఉంటుంది.
This post was last modified on April 13, 2021 10:14 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…