Political News

రెండుచోట్లా బీజేపీ పరిస్ధితి సేమ్ టు సేమ్ ?

తెలంగాణా, ఏపిలో రెండు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండింటిలోను బీజేపీ మాత్రం తిరుపతి లోక్ సభకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేసేందుకు తెలంగాణా బీజేపీ నేతలు కూడా వరుసగా క్యూ కడుతున్నారు కాబట్టి.

నిజానికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. దీంతో పోల్చుకుంటే నాగార్జునసాగర్ ఉపఎన్నికలోనే కమలం కాస్త మెరుగని ప్రచారం జరిగింది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన బీజేపీ నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిజానికి దుబ్బాకలో గెలిచేంతసీన్ కమలంకు లేదు. టీఆర్ఎన్ నిర్లక్ష్యానికి తోడు అనేక అంశాలు కలిసొచ్చి బీజేపీ అక్కడ గెలిచిందంతే.

ఇక గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పైనున్న వ్యతిరేకత+ఎంఐఎంను టార్గెట్ చేయటం లాంటి అనేక అంశాలతో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. అదే ఊపుతో సాగర్ ఉపఎన్నికలో కూడా గెలుపుమాదే అంటే రెచ్చిపోయారు. అయితే ఈమధ్యనే జరిగిన రెండు ఎంఎల్సీ ఎన్నికల్లోను బీజేపీ ఓడిపోయింది. దాంతో నేతలు ఆకాశం నుండి భూమి మీదకు దిగొచ్చారు. టీఆర్ఎస్ పై రెచ్చిపోవటం, కేసీయార్ ను రెచ్చగొట్టడంతో పాటు కమలం ఊపుకూడా తగ్గిపోయింది.

ఇలాంటి అనేక కారణాల వల్ల సాగర్ ఉపఎన్నికల్లో ప్రచారం కన్నా తెలంగాణా నేతలు తిరుపతి ప్రచారంవైపే మొగ్గుచూపుతున్నారు. సాగర్లో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అని కమలనాదులకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే దుబ్బాక ఎంఎల్ఏ రఘునందనరావు, మాజీమంత్రి బాబూమోహన్ తో పాటు అనేకమంది బీజేపీ నేతలు తిరుపతిలో ప్రచారం చేశారు. సరే ఎవరు ప్రచారం చేసినా చెప్పేదేమిటంటే తిరుపతి ఉపఎన్నికలో దుబ్బాక రిజల్టే రిపీట్ అవుతుందని.

కానీ వీళ్ళు మరచిపోయిందేమంటే దుబ్బాకలో కేసీయార్ నిర్లక్ష్యంచూపించారు. సానుభూతి ఓట్లే గెలిపిస్తాయనే భ్రమలో ఉండటమే దెబ్బకొట్టింది. కానీ తిరుపతిలో జగన్ నిర్లక్ష్యంగా లేరు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ కమలనాదులు నేతలు చెబుతున్నట్లుగా దుబ్బాక రిజల్టే రిపీటయినా అది బీజేపీకి అనుకూలంగా కాదు దానికన్నా ముందు టీడీపీ ఉందన్న విషయం మరచిపోకూడదు.

This post was last modified on April 12, 2021 3:04 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

58 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

2 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

3 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

4 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago