తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ చేసిన పని అందరికీ విపరీతంగానే అనిపిస్తోంది. తాజాగా ఉపఎన్నిక విషయంలో కమలనాదులు మ్యానిఫెస్టోను విడుదల చేయటమే ఈ చర్చకు దారితీసింది. ఒక ఉపఎన్నిక కోసం ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టోను విడుదల చేయదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది బీజేపీ నేతలు మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆచరణ సాధ్యంకాని హామీలన్నింటినీ గుప్పించేటప్పటికి కమలనాదుల చర్య అందరికీ వైపరీత్యంగానే కనిపిస్తోంది.
సాధారణ ఎన్నికల సమయంలో పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేయటం సహజం. గెలిస్తే తాము ఏమి చేయబోతున్నామనే విషయాన్నే హామీల రూపంలో పార్టీలు మ్యానిఫెస్టోలో స్పష్టం చేస్తాయి. సరే గెలిచిన తర్వాత వాటిని ఎంతవరకు ఆచరిస్తాయనేది వేరేసంగతి. ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క ఎంఎల్ఏ గానీ ఒక్క ఎంపి గాని లేరు. అలాంటిది తిరుపతి ఉపఎన్నికలో గెలిచనంత మాత్రాన తన హామీలను ఏ విధంగా అమలు చేద్దామని అనుకుంటున్నదో అర్ధం కావటంలేదు.
మ్యానిఫెస్టోను తయారుచేసిన వాళ్ళు, రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకందరికీ తెలుసు మ్యానిఫెస్టో అంటే జనాలు నవ్వుకుంటారని. అయినా సరే విడుదల చేశారంటే జనాలను సదరు నేతలు ఏ స్ధాయిలో ఊహించుకుంటున్నారో అర్ధమైపోతోంది. ఈమధ్యనే జరిగిన పంచాయితి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇలాగే ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను విడుదల చేసి నవ్వులపాలైన విషయం అందరికీ తెలిసిందే.
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…