తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ చేసిన పని అందరికీ విపరీతంగానే అనిపిస్తోంది. తాజాగా ఉపఎన్నిక విషయంలో కమలనాదులు మ్యానిఫెస్టోను విడుదల చేయటమే ఈ చర్చకు దారితీసింది. ఒక ఉపఎన్నిక కోసం ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టోను విడుదల చేయదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది బీజేపీ నేతలు మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆచరణ సాధ్యంకాని హామీలన్నింటినీ గుప్పించేటప్పటికి కమలనాదుల చర్య అందరికీ వైపరీత్యంగానే కనిపిస్తోంది.
సాధారణ ఎన్నికల సమయంలో పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేయటం సహజం. గెలిస్తే తాము ఏమి చేయబోతున్నామనే విషయాన్నే హామీల రూపంలో పార్టీలు మ్యానిఫెస్టోలో స్పష్టం చేస్తాయి. సరే గెలిచిన తర్వాత వాటిని ఎంతవరకు ఆచరిస్తాయనేది వేరేసంగతి. ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క ఎంఎల్ఏ గానీ ఒక్క ఎంపి గాని లేరు. అలాంటిది తిరుపతి ఉపఎన్నికలో గెలిచనంత మాత్రాన తన హామీలను ఏ విధంగా అమలు చేద్దామని అనుకుంటున్నదో అర్ధం కావటంలేదు.
మ్యానిఫెస్టోను తయారుచేసిన వాళ్ళు, రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకందరికీ తెలుసు మ్యానిఫెస్టో అంటే జనాలు నవ్వుకుంటారని. అయినా సరే విడుదల చేశారంటే జనాలను సదరు నేతలు ఏ స్ధాయిలో ఊహించుకుంటున్నారో అర్ధమైపోతోంది. ఈమధ్యనే జరిగిన పంచాయితి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇలాగే ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను విడుదల చేసి నవ్వులపాలైన విషయం అందరికీ తెలిసిందే.
This post was last modified on April 12, 2021 11:14 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…