Political News

మారుతోన్న రాజ‌కీయం.. రంగంలోకి భార‌తి ?

వైఎస్‌. జ‌గ‌న్ ఏపీలో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మారిపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ పార్టీ పెట్టి సీఎం అయ్యే వ‌ర‌కు క‌ష్ట‌ప‌డిన వారిలో ఎంతో మంది ఉన్నారు. వీరంద‌రి కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డారు జ‌గ‌న్ చెల్లి ష‌ర్మిల‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి.

ష‌ర్మిల పార్టీ కోసం చేసిన సేవ చెప్ప‌లేనిది.. వెల‌క‌ట్ట‌లేనిది. ఆమె అన్న జైలులో ఉన్న‌ప్పుడు సుధీర్ఘంగా పాద‌యాత్ర చేశారు. 2014 ఎన్నిక‌ల్లో క‌డ‌ప లేదా ఖ‌మ్మం ఎంపీ సీటు ఆశించినా చెల్లికి ఎంపీ సీటు ఇవ్వ‌డం సుత‌రాము ఇష్టంలేని జ‌గ‌న్ తల్లి విజ‌య‌ల‌క్ష్మికి వైజాగ్ ఎంపీ సీటు ఇచ్చి ప‌రోక్షంగా చెక్ పెట్టేశారు. త‌ల్లికి ఎంపీ సీటు ఇవ్వ‌డంతో ష‌ర్మిల అడ‌గ‌లేక‌పోయారు.

ఇక గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా బైబై బాబు అన్న నినాదంతో అన్న‌ను సీఎం చేసేందుకు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీ సీటు ఆశించిన ఆమెకు జ‌గ‌న్ షాక్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చార క‌నీసం రాజ్య‌స‌భ ఇస్తార‌నుకుంటే అస‌లు ష‌ర్మిల పేరు కూడా విన‌ప‌డ‌డం లేదు. జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు ముందు పార్టీలో ఎంతో మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు జ‌గ‌న్ పేరు త‌ప్ప ఎవ్వ‌రి పేరు విన‌ప‌డ‌డం లేదు. జ‌గ‌న్ త‌ప్ప ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్‌. భార‌తి మాత్రం వార్త‌ల్లో నిలుస్తున్నారు.

భార‌తికి రాజ‌కీయాల్లో రాణించాల‌న్న కాంక్ష ఉందా ? లేదా ? అన్న‌ది తెలియ‌దు కాని.. జ‌గ‌న్ ఏ ప‌రిస్థితుల్లో అయినా సీఎం పీఠం నుంచి త‌ప్పుకుంటే ఆప్ష‌న్ మాత్రం భార‌తియే అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ విష‌యంలో ఎవ్వ‌రూ సందేహం కూడా వ్య‌క్తం చేయ‌లేని ప‌రిస్థితి. ఒక వేళ ఇప్పుడు ఉన్న అనేక సందేహాల నేప‌థ్యంలో జగన్ జైలుకే వెళ్ళాల్సి వస్తే కూడా భారతి తప్ప మరో ఆప్షన్ కూడా జగన్‌కు, వైసీపీకి లేదు. జ‌గ‌న్ స్థానంలో ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న కోరిక ఎవ‌రికి అయినా ఉన్నా… ఆ ఛాన్స్ జ‌గ‌న్ ఇవ్వ‌ను కూడా ఇవ్వ‌డు. జ‌గ‌న్ త‌ర్వాత రెండో ఆప్ష‌న్‌గా ఏ నేత పేరు పైకి రాకుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డ్డారు.

ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ నుంచి అనేకానేక నేత‌లు పోటీ ప‌డుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌చారంలో లేరు. ఒక్క‌రంటే ఒక్క స్టార్ క్యాంపెయిన‌ర్ కూడా వైసీపీలో లేరు. ఈ లోటు కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. మ‌రోవైపు చంద్ర‌బాబు, లోకేష్ ప్ర‌చారంలో తెగ తిరుగుతున్నారు. ఇలాంటి టైంలో ష‌ర్మిల ఉంటే వైసీపీకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఉండేది. ఇప్పుడు ష‌ర్మిల కొత్త పార్టీ పెట్టుకున్న నేప‌థ్యంలో ఇక భార‌తి పూర్తి స్థాయి రాజ‌కీయ రంగంలోకి దిగ‌క త‌ప్ప‌ద‌ని.. జ‌గ‌న్‌కు ఆమె రైట్ హ్యాండ్‌గా ఉంటేనే జ‌గ‌న్‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి భార‌తి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ? చూడాలి.

This post was last modified on April 12, 2021 8:27 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago