తన పక్షం కాకుంటే.. ఒకలా ? తన పక్షంలో చేరితే ఒకలా మారిపోయే రాజకీయాలు ఇప్పుడు కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఏం చేసినా తప్పులుగా చూసే.. అధికార పక్షం.. వారే అధికార పక్షానికి కొమ్ము కాస్తే.. మాత్రం ఆ తప్పులు కూడా ఒప్పులు అయిపోవడం ఖాయం. రాజకీయాల్లో ఇదో అంటు వ్యాధి మాదిరిగా మారిపో యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉన్న వివాదాలను, కేసులను, వారి సమస్యలను కూడా అధికార పక్షం తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలే ఉండొద్దన్నట్టుగా కూడా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో జరిగిన విషయాన్నే తీసుకుంటే.. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును టీఆర్ఎస్లో కలిపేసుకుని.. టీడీఎల్పీని విలీనం చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే. వీరయ్య.. గతంలో స్టీఫెన్ సన్ కేసులో అంటే.. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్సన్) ఓటు కోసం.. డబ్బు లు ఇవ్వ జూపారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2015లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ కేసులోనే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారనే పేరు వినిపించింది.
ఈ కేసు ఇలా సాగుతున్న క్రమంలోనే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఉన్న రేవంత్రెడ్డి.. కాంగ్రెస్లోకి జంప్ చేశారు. ఇక, చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఏకంగా మకాం మార్చారు. ఇక, వెంకట వీరయ్య.. గత ఎన్నికల్లో గెలిచే వరకు టీడీపీలో ఉన్నా.. పరోక్షంగా కేసీఆర్కు అనుకూలంగా వ్యవ హరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ నేరుగా ఈయనను పార్టీలోకి చేర్చుకున్నారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓటుకు నోటు కేసును ఉపేక్షించేది లేదని.. నిందితులు ఎంతవారైనా కోర్టుకు ఈడుస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు అదే కేసులో నిందితులుగా ఉన్న వీరయ్యను తన పార్టీలోకి చేర్చు కోవడం.
ఇక ఈ కేసు ఎంత సీరియస్గా ఉందంటే.. వీరయ్య ఇటీవల డిశ్చార్జ్ పిటిషన్ వేసినా.. ఏసీబీ కోర్టు తోసిపు చ్చింది. అంటే.. ఏసీబీ కోర్టు.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విభాగమే తప్పు చేసినట్టు తేల్చగా.. ఇప్పుడు ఈ కేసును తేల్చేస్తాను..అన్న కేసీఆర్.. ఇలా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. తనకు చాలినంత బలం ఉన్నప్పటికీ.. ఇలా చేయడం కేసీఆర్ రెండునాల్కల ధోరణికి నిదర్శనమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 10, 2021 10:53 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…