దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల శుక్రవారం నిర్వహించ నున్న ఖమ్మం సభ హాట్ టాపిక్గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షర్మిల సభకు సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం సభకు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్తో షర్మిల ఉత్సాహంగా బయలు దేరారు. అయితే.. ముందస్తుగా నిర్ణయించుకున్న సమయానికి సభ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. ఆమె నేరుగా సభకు రాకుండా.. దారిలో ఆగుతూ.. ప్రజలను పలకరించేలా ప్లాన్ చేసుకున్నారు.
200లోపే కార్లు..
వాస్తవానికి ఆదిలో వెయ్యి కార్లతో కాన్వాయ్ ఉంటుందని భావించాని.. రెండు వందల కార్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. వరుస సెలవులు రావడంతో.. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొంటూ.. కేవలం 200 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్లోని లోటస్ పాండ్ నుంచి కాన్వాయ్తో బయల్దేరిన షర్మిలకు ఈ పరిణామం కూడా ఒకింత చిరాకు తెప్పించిందని అంటున్నారు.
మండకొడి ప్రయాణం
ప్రస్తుతం ఉదయం 11 గంటలకు దాటే సరికి ఎల్బీనగర్, అబ్దుల్లాపుర్ మెట్ వంటి ప్రాంతాలకు మాత్రమే ఆమె చేరుకున్నారు. ఇంకా అక్కడ నుంచి దాదాపు 170 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం.. షర్మిల సాయంత్రం 4 గంటలకు ఖమ్మం పరిసరాలకు చేరాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు మధ్య మధ్య ఆగుతూ సాగుతుండడంతో సభ అనుకున్న సమయానికి జరిగే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. కాన్వాయ్ మందకొడిగానే ముందుకు సాగుతుండడం గమనార్హం.
షర్మిలకు ఆదిలోనే నిరాశ
ఇక, షర్మిల ఆశించిన విధంగా కూడా తెలంగాణ ప్రజలు జోరుగా ఎక్కడా కనిపించకపోవడం మరో సెట్ బ్యాక్. వైఎస్ అభిమానులు మాత్రమే రోడ్ల మీదకు వచ్చి.. షర్మిలను పలకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా సెటిర్లలో కొందరు మాత్రమే షర్మిలకు అభివాదం చెబుతున్న వారిలో కనిపించారు. ఏతావాతా ఎలా చూసినా.. తెలంగాణ ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడం గమనార్హం. మరి.. సభ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on April 9, 2021 1:59 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…