ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ నేతలకు ఉండే సమస్య ఏమంటే.. వారి నోటి నుంచి ప్రతి మాటా ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. సామాన్యుల మాదిరి ఒక మాట ఎక్కువ తక్కువలు వచ్చినా చిక్కే. చిన్న తేడా వచ్చినా అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే కొని తెచ్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు.
ప్రస్తుతం ఏపీలో ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లిన వాసుబాబు.. గోపీనాథపట్నంలో ప్రచారానికి వెళ్లారు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి.. ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మితరఫున ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ఆ ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఎమ్మెల్యే నోటి నుంచి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్న మాట వచ్చినంతనే.. చుట్టు ఉన్న వారిలో కలకలం. ఎమ్మెల్యే మాట్లాడిన తప్పు మాటను గుర్తించిన ఒక అభ్యర్థి ఏకంగా తల పట్టుకున్న పరిస్థితి. నాలుక జారి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్న ఎమ్మెల్యే వాసుబాబు.. వెంటనే తేరుకొని.. ఎన్నికల నుంచి పారిపోయిన పార్టీ గుర్తుకు వచ్చి అలా అన్నానని.. సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలంటూ జోక్ చేశానని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను తప్పు మాట్లాడినట్లు గుర్తించి సారీ చెప్పేసిన ఆయన.. తర్వాతి సంభాషణలో మాత్రం కవరింగ్ ఇవ్వటంతో అక్కడున్న వారంతా ఎమ్మెల్యేగారి మాటలకు ముసిముసి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న ఎమ్మెల్యే మాటల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వింటే ఎలా రియాక్టు అవుతారో?
This post was last modified on April 5, 2021 3:51 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…