Political News

కోటి రూపాయల చెక్కులు ఇచ్చేశారు

విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉందంతం తాలూకు విషాదం గురించి చెప్పడానికి మాటలు రావు. 12 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఉదంతం.. వందల మందిని అస్వస్థతకు గురి చేసింది. ఐతే ఈ విషాదంపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఘటన జరిగిన రోజు మధ్యాహ్నమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున భారీ నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ పరిహారం అంటే పది లక్షలో.. పాతిక లక్షలో ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ.. ఏకంగా కోటి రూపాయల కాంపెన్జేషన్ అనేసరికి అందరూ షాకయ్యారు. కోటి రూపాయలు ఇచ్చినా బాధిత కుటుంబాల బాధ పోదు కానీ.. ప్రభుత్వ పరంగా ఇది పెద్ద సాయమే. ఐతే ఈ పరిహారం కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం బాధితులకు లేకుండా చూసింది ప్రభుత్వం.

మొన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థ ముందు బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుల కోసం చెక్కులు రెడీ చేసింది. మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు సోమవారం చెక్కులు తీసుకెళ్లి బాధితులకు పంపిణీ చేశారు.

కంపెనీ నిర్లక్ష్యం, దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది అన్నది పక్కన పెడితే.. ఈ ఘోరం చోటు చేసుకున్న నాలుగో రోజుకే బాధితులకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేయడం మాత్రం అభినందనీయం.

మరోవైపు గ్యాస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోకి జనాలను ఇంకా అనుమతించడం లేదు. శానిటైజేషన్ పూర్తి స్థాయిలో చేసి, పరిసర ప్రాంతాలు పూర్తి సురక్షితం అని నిర్ధరించాకే ప్రజల్ని అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్యాస్ ప్రభావం నేపథ్యంలో ఇళ్లలోని నిత్యావసరాలన్నీ బయట పడేయక తప్పదని అంటున్నారు నిపుణులు.

This post was last modified on May 11, 2020 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

55 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago