దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువుగా ఆకర్షిస్తోన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2016 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 18 ఎంపీ సీట్లను గెలుచుకుని సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఇదే ఊపుతో మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఆరు నెలలుగా మమత వర్సెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఇక బీజేపీ బెంగాల్లో గెలిచిపోతోందంటూ కూడా ఓ వర్గం జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైప్ తెస్తోంది.
తాజా సమాచారం ప్రకారం బెంగాల్లో బీజేపీ సీన్ రివర్స్ అవుతోన్న పరిస్థితే కనిపిస్తోంది. స్వల్ప కాలంలోనే మారిన అనేక పరిణామాలు మరోసారి అక్కడ మమతకు పట్టం కట్టబెడుతున్నాయని తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్లు కలిసి పోటీ చేస్తున్నారు. అంచనాలకు మించి కాంగ్రెస్ + కమ్యూనిస్టుల కూటమి పుంజుకున్నట్టు తెలుస్తోంది. అయితే వీరు విజయం సాధించకపోయినా పలు చోట్ల బలమైన, మంచి పేరున్న అభ్యర్థులను నిలబెట్టడంతో వారు చీల్చే ఓట్లు బీజేపీని దెబ్బ కొట్టబోతున్నాయట.
తొలి రెండు దశల పోలింగ్ ఇప్పటికే ముగిసింది. అయితే బీజేపీ ఈ రెండు దశలపైనే ఎక్కువుగా ఆశలు పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ రెండు దశల్లో మొత్తం 60 సీట్లకు ఎన్నికలు జరగగా.. ఇక్కడ 90 శాతం సీట్లు గెలుచుకుంటామని ముందు నుంచి ధీమాతో ఉంది. అంతే కాకుండా నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోబోతోందంటూ బీజేపీ అతి ప్రచారం కూడా స్టార్ట్ చేసింది. కానీ వాస్తవంగా తెలుస్తోన్న సమాచారంతో పాటు పలు తెలుగు సర్వేల్లో బెంగాల్ల సీన్ మారినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మమతకు ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీల మద్దతు ఉంది. ముస్లింల ఓటు బ్యాంక్ ఎప్పటకీ మమతదే. ఇప్పుడు వీరితో పాటు ఓబీసీలు కూడా మమత వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. ఇక బెంగాల్ మహిళా సమాజం వన్సైడ్గా మమతకే ఓట్లేయబోతున్నట్టు అక్కడ ట్రెండ్స్ చెపుతున్నాయి. మహిళలు మమతను వదులుకునేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరని అక్కడ పల్స్ చెప్పేస్తున్నాయ్..! ఇక మమత పోటీ చేసిన నందిగ్రామ్లో ఆమె 25- 30 వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నారంటూ సమాచారం. ఇక మొత్తం ఎనిమిది దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో బెంగాల్లో భారీ మార్పు కనపడుతోందని… తృణమూల్ 170కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతోందంటూ వీరు చెపుతున్నారు.
ఇక డ్యామ్ ష్యూర్గా అధికారంలోకి వస్తామని బీరాలు పోతోన్న బీజేపీ 90 – 100 సీట్లలోపు మాత్రమే పరిమితమవుతుందని మెజార్టీ సర్వేలు చెపుతున్నాయి. ఏదేమైనా బెంగాల్లో మమత కోట బద్దలు కొట్టేస్తున్నామని చెపుతోన్న బీజేపీకి ఫలితాలు తేడా వస్తే జాతీయ స్థాయిలో పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.
This post was last modified on April 4, 2021 11:34 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…