Political News

లోక్ సభలో విజయం కోసం సరికొత్త వ్యూహం

ఎలాగైనా సరే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. జనాలు దగ్గరవ్వటానికి భారీ బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల వంటివాటికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యింది. దీని స్ధానంలో ఇంటింటికి ప్రచారం అనే కాన్సెప్టును బలంగా ముందుకు తీసుకొస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ప్రతి ఇంటిని కనీసం పదిసార్లయినా టచ్ చేయాలనే టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నది పార్టీ అగ్రనాయకత్వం.

పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతల విజయానికి ఇంటింటికి ప్రచారం అనే వ్యూహమే ప్రధాన కారణంగా టీడీపీ గుర్తించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి తెలిసేలా వైసీపీ నేతలు గట్టి వ్యూహంతో ముందుకెళ్ళారు. వీళ్ళకు గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ బాగా సహకరించిందన్న విషయాన్ని టీడీపీ గుర్తించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వ పథకాల గురించి జనాలకు పదే పదే గుర్తుచేశారు.

సో వైసీపీ ప్రచార పద్దతిని గుర్తించిన టీడీపీ కూడా తన రూటును మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకనే లోక్ సభ నియజకవర్గాన్ని 70 క్లస్టర్లుగా విభజించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని క్లస్టర్లకు సుమారు 25 వేలమంది కార్యకర్తలను కేటాయించబోతోంది. వీరితో నేతలను సమన్వయం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. వీరందరి సహకారంతో క్లస్టర్లలోని కార్యకర్తలు, నేతలు ప్రతి ఇంటిని టచ్ చేయాలనే టార్గెట్ ను ఫిక్స్ చేసింది.

పోలింగ్ జరిగేలోగా ప్రతి ఇంటిని పదిసార్లు టచ్ చేసి అధికారపార్టీ చేస్తున్న ధౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి పాలనలోని దురాగతాలను జనాలందరికీ వివరించబోతున్నది. గతంలో ఇలాంటి పనులు చేయటానికి బూత్ కమిటీలుండేవి. అయితే వివిధ కారణాలతో ఆ విధానం దెబ్బతినేసింది. అయితే లోక్ సభ ఉపఎన్నికల కారణంగా మళ్ళీ అదే బూత్ కమిటిల వ్యవస్ధను తిరిగి యాక్టివేట్ చేయబోతున్నది టీడీపీ అగ్రనాయకత్వం. మరి తన పద్దతిలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

This post was last modified on April 3, 2021 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago