Political News

లోక్ సభలో విజయం కోసం సరికొత్త వ్యూహం

ఎలాగైనా సరే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. జనాలు దగ్గరవ్వటానికి భారీ బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల వంటివాటికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యింది. దీని స్ధానంలో ఇంటింటికి ప్రచారం అనే కాన్సెప్టును బలంగా ముందుకు తీసుకొస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ప్రతి ఇంటిని కనీసం పదిసార్లయినా టచ్ చేయాలనే టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నది పార్టీ అగ్రనాయకత్వం.

పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతల విజయానికి ఇంటింటికి ప్రచారం అనే వ్యూహమే ప్రధాన కారణంగా టీడీపీ గుర్తించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి తెలిసేలా వైసీపీ నేతలు గట్టి వ్యూహంతో ముందుకెళ్ళారు. వీళ్ళకు గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ బాగా సహకరించిందన్న విషయాన్ని టీడీపీ గుర్తించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వ పథకాల గురించి జనాలకు పదే పదే గుర్తుచేశారు.

సో వైసీపీ ప్రచార పద్దతిని గుర్తించిన టీడీపీ కూడా తన రూటును మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకనే లోక్ సభ నియజకవర్గాన్ని 70 క్లస్టర్లుగా విభజించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని క్లస్టర్లకు సుమారు 25 వేలమంది కార్యకర్తలను కేటాయించబోతోంది. వీరితో నేతలను సమన్వయం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. వీరందరి సహకారంతో క్లస్టర్లలోని కార్యకర్తలు, నేతలు ప్రతి ఇంటిని టచ్ చేయాలనే టార్గెట్ ను ఫిక్స్ చేసింది.

పోలింగ్ జరిగేలోగా ప్రతి ఇంటిని పదిసార్లు టచ్ చేసి అధికారపార్టీ చేస్తున్న ధౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి పాలనలోని దురాగతాలను జనాలందరికీ వివరించబోతున్నది. గతంలో ఇలాంటి పనులు చేయటానికి బూత్ కమిటీలుండేవి. అయితే వివిధ కారణాలతో ఆ విధానం దెబ్బతినేసింది. అయితే లోక్ సభ ఉపఎన్నికల కారణంగా మళ్ళీ అదే బూత్ కమిటిల వ్యవస్ధను తిరిగి యాక్టివేట్ చేయబోతున్నది టీడీపీ అగ్రనాయకత్వం. మరి తన పద్దతిలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

This post was last modified on April 3, 2021 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

20 minutes ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

24 minutes ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

3 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

4 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

4 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

4 hours ago