ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలన్న నిర్ణయంపై ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు సైతం ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నేత.. మంత్రి కేటీఆర్ అయితే.. విశాఖ ఉక్కు అమ్మకంపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. అధినేత కేసీఆర్ అనుమతి తీసుకొని ఆందోళనలో పాల్గొంటామని.. ఏపీకి వెళతామని చెప్పి సంచలనంగా మారారు.
కేంద్రం తీసుకున్న అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ నిరసనను పట్టించుకోని కేంద్రం మాత్రం తాను అనుకున్నట్లే విశాఖ ఉక్కును అమ్మేయాలన్న పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకునేలా విశాఖ ఉక్కు కార్మికులు పని తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జపాన్ లో ఏదైనా అంశంపై ఆందోళన చేయాలంటే..పని మానేసే బదులు మరింత ఎక్కువగా పని చేస్తారు. రెట్టింపు ఫలితాన్నినమోదు చేస్తారు.
తాజాగా విశాఖ ఉక్కు ఉద్యోగులు ఇదే సూత్రాన్ని పాటించారు. విశాఖ ఉక్కు చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా భారీ టర్నోవర్ ను నమోదు చేశారు. ఓవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. గడిచిన యాభై రోజులుగా కార్మికులు షిప్టుల వారీగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణ ఆగాలంటే సంస్థను భారీ లాభాల బాట పట్టించాలన్న పట్టుదలతో ఉన్న వారు విపరీతంగా పని చేస్తున్నారు. దీంతో.. మార్చి ఒక్క నెలలో 7.11లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించారు. దీంతో రూ.3300 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని తొలిసారి సాధించినట్లు సంస్థ సీఎండీ వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగుల్ని.. కార్మికుల్ని అభినందించారు. నష్టాల బూచి చూపించి సంస్థను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా లాభాల బాటలో నడిచేలా సంస్థను తీసుకొస్తున్న కార్మికుల తీరుతోకేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా వచ్చిన తాజా ఫలితం మోడీ సర్కారుకు షాకింగ్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on April 2, 2021 10:01 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…