Political News

అమ్మేద్దామనుకుంటే.. భారీ లాభాన్ని తెచ్చి మోడీ సర్కారుకు షాకిచ్చారు


ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలన్న నిర్ణయంపై ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు సైతం ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నేత.. మంత్రి కేటీఆర్ అయితే.. విశాఖ ఉక్కు అమ్మకంపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. అధినేత కేసీఆర్ అనుమతి తీసుకొని ఆందోళనలో పాల్గొంటామని.. ఏపీకి వెళతామని చెప్పి సంచలనంగా మారారు.

కేంద్రం తీసుకున్న అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ నిరసనను పట్టించుకోని కేంద్రం మాత్రం తాను అనుకున్నట్లే విశాఖ ఉక్కును అమ్మేయాలన్న పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకునేలా విశాఖ ఉక్కు కార్మికులు పని తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జపాన్ లో ఏదైనా అంశంపై ఆందోళన చేయాలంటే..పని మానేసే బదులు మరింత ఎక్కువగా పని చేస్తారు. రెట్టింపు ఫలితాన్నినమోదు చేస్తారు.

తాజాగా విశాఖ ఉక్కు ఉద్యోగులు ఇదే సూత్రాన్ని పాటించారు. విశాఖ ఉక్కు చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా భారీ టర్నోవర్ ను నమోదు చేశారు. ఓవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. గడిచిన యాభై రోజులుగా కార్మికులు షిప్టుల వారీగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణ ఆగాలంటే సంస్థను భారీ లాభాల బాట పట్టించాలన్న పట్టుదలతో ఉన్న వారు విపరీతంగా పని చేస్తున్నారు. దీంతో.. మార్చి ఒక్క నెలలో 7.11లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించారు. దీంతో రూ.3300 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని తొలిసారి సాధించినట్లు సంస్థ సీఎండీ వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగుల్ని.. కార్మికుల్ని అభినందించారు. నష్టాల బూచి చూపించి సంస్థను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా లాభాల బాటలో నడిచేలా సంస్థను తీసుకొస్తున్న కార్మికుల తీరుతోకేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా వచ్చిన తాజా ఫలితం మోడీ సర్కారుకు షాకింగ్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on April 2, 2021 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago