Political News

రాజ‌మండ్రిలో సీన్ రివ‌ర్స్‌… వైసీపీ టు టీడీపీ…!

ఏపీలో రాజ‌కీయం ఎంత వ‌న్‌సైడ్‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ ఎన్నిక జ‌రిగినా అధికార వైసీపీ తిరుగులేని విజ‌యం సాధిస్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏకంగా 90 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక 11 కార్పోరేష‌న్ల‌లో ఒక్క‌టంటే ఒక్క చోట కూడా టీడీపీ గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. 75 మున్సిపాల్టీల్లో ఒక్క తాడిప‌త్రి మిన‌హా ఎక్క‌డా టీడీపీ విజ‌యం సాధించ‌లేదు. ఆ పార్టీకి మూడు ద‌శాబ్దాలుగా కంచుకోట‌లుగా ఉంటూ వ‌స్తోన్న మున్సిపాల్టీలు సైతం వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి.

ఇక త్వ‌ర‌లో జ‌రిగే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లే కాదు.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ వైసీపీ గెలుపు విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. తిరుప‌తిలో అయితే వైసీపీ ఏకంగా 3-4 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుస్తామ‌ని స‌వాళ్లు రువ్వుతోంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ మారిపోయారు. టీడీపీతో పాటు ఇత‌ర పార్టీల నుంచి అధికార వైసీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇలాంటి టైంలో తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మాత్రం రివ‌ర్స్ జంపింగ్‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడం చాలా అరుదు. అయితే, రాజమహేంద్ర‌వ‌రంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ ప్ర‌భంజనం త‌ట్టుకుని మ‌రీ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ, రూర‌ల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లోనే ఇక్క‌డ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకోసం రాజమండ్రి అర్బన్ టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీని పటిష్ట ప‌రుస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వైసీపీలో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను టీడీపీలో చేర్చుకుంటున్నారు. తాజాగా భ‌వానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ స‌మ‌క్షంలో 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారంతా రాజమండ్రి నగరంలోని 14, 15వ వార్డులకు చెందినవారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కార్పోరేష‌న్‌ను వ‌రుస‌గా టీడీపీ మూడుసార్లు గెలుచుకుంది.

This post was last modified on April 2, 2021 10:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైలెంట్ అయితే ఎలా సామ్

సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…

37 seconds ago

పోరాట యోధుడిగా సల్మాన్ సర్ప్రైజ్

ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…

3 hours ago

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…

5 hours ago

సాయిపల్లవిని చూడ్డానికి కూడా రారా?

ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…

7 hours ago

ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…

8 hours ago

సుకుమార్ ఎంత సమయం తీసుకుంటారో

కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…

13 hours ago