ఏపీలో రాజకీయం ఎంత వన్సైడ్గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఎన్నిక జరిగినా అధికార వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 90 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఇక 11 కార్పోరేషన్లలో ఒక్కటంటే ఒక్క చోట కూడా టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 75 మున్సిపాల్టీల్లో ఒక్క తాడిపత్రి మినహా ఎక్కడా టీడీపీ విజయం సాధించలేదు. ఆ పార్టీకి మూడు దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉంటూ వస్తోన్న మున్సిపాల్టీలు సైతం వైసీపీ ఖాతాలో పడ్డాయి.
ఇక త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే కాదు.. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ వైసీపీ గెలుపు విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. తిరుపతిలో అయితే వైసీపీ ఏకంగా 3-4 లక్షల మెజార్టీతో గెలుస్తామని సవాళ్లు రువ్వుతోంది. ఇక ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ మారిపోయారు. టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి అధికార వైసీపీలోకి భారీ ఎత్తున వలసలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇలాంటి టైంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాత్రం రివర్స్ జంపింగ్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడం చాలా అరుదు. అయితే, రాజమహేంద్రవరంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం తట్టుకుని మరీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇక త్వరలోనే ఇక్కడ కార్పోరేషన్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇందుకోసం రాజమండ్రి అర్బన్ టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీని పటిష్ట పరుస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీలో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. తాజాగా భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారంతా రాజమండ్రి నగరంలోని 14, 15వ వార్డులకు చెందినవారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక రాజమహేంద్రవరం కార్పోరేషన్ను వరుసగా టీడీపీ మూడుసార్లు గెలుచుకుంది.
This post was last modified on April 2, 2021 10:02 am
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…