Political News

విశాఖ ముహుర్తం ఫిక్స్… సీఎం ధైర్యం ఏంటి?

రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌న్న‌.. త‌న క‌ల‌ను, ప‌ట్టుద‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ అంతే వేగంగా పావులు క‌దుపుతున్నారు. అమ‌రావతిని కేవ‌లం ఓ సామాజిక వ‌ర్గం కోస‌మే నిర్మాణం చేశార‌న్న ఆయ‌న దానిని కేవ‌లం చ‌ట్ట‌స‌భ‌ల రాజ‌ధానిగా ఉంచేసి.. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని స‌మ‌తుల్యం చేస్తామ‌ని.. త‌ద్వారా.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తినే కావాలంటూ.. అక్క‌డి ప్రాంత రైతులు, ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తున్నారు.

అదే స‌మ‌యంలో న్యాయ పోరాటం కూడా జ‌రుగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ మ‌రికొద్దిరోజుల్లోన‌నే ప్రారంభం కానుంది. అయితే… ఇప్ప‌టికే విశాఖ‌కు పాల‌నా రాజ‌ధానిని త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం జ‌గ‌న్ ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. నిర్ణ‌యించిన ముహూర్తం మే 6వ తేదీ నాటికి అక్క‌డికి చేరిపోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విశాఖ‌లో అనేక చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖ విమానాశ్ర‌యంలో ప్ర‌స్తుతం ఉన్న విమానాల సంఖ్య 43 నుంచి 58కి పెంచారు. దీనికి కొన్నాళ్ల కింద‌టే కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించిన‌ట్టు తాజాగా తెలిసింది.

అదే స‌మ‌యంలో విశాఖ‌లో కీల‌క ర‌హ‌దారుల‌ను భారీ ఎత్తున విస్త‌రిస్తున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఏర్పాటు చేసేందుకు అనువైన భ‌వ‌నాల ఎంపిక కూడా పూర్త‌యిన‌ట్టు తెలిసింది. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు నిరంత‌రం అక్క‌డ ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నాయి. అక్క‌డ మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు ఎన్ని నిధులు కావాల‌న్నా.. ప్ర‌భుత్వం వెనుకాడ‌కుండా ఇస్తోంది. అయితే.. ఇదంతా చేయ‌డం వెనుక మ‌రో రీజ‌న్ కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అదేంటంటే.. ప్ర‌స్తుతం హైకోర్టులో జ‌రుగుతున్న విచార‌ణ తుదిద‌శ‌కు చేరుకునే లోపే.. విశాఖ‌లో 50 శాతం పాల‌న ప్రారంభం కావాలి. లేక‌పోతే.. సుప్రీం కోర్టులో కీల‌క న్యాయ‌మూర్తులు మారే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. మార్పు ఆగిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. అంతా ముంద‌స్తుగా జ‌రిగేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆల్డ్రెడీ ఏర్పాటైన రాజ‌ధానిని త‌ర‌లించే సాహసం ఎవ‌రూ చేయ‌రు క‌నుక‌.. జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 31, 2021 7:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago