Political News

సానుభూతిపైనే కేసీయార్ ఆశలు ?

అవును నాగార్జునసాగర్ ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య కొడుక్కి టికెట్ ఇవ్వటంతోనే ఈ విషయం అందరికీ అర్దమైపోయింది. నోముల కొడుకు నోముల భగత్ కు కేసీయార్ పార్టీ కార్యాలయంలో బీఫారమ్ అందించారు. దాంతో సాగర్ ఉపఎన్నికలో కూడా కేసీయార్ సానుభూతి రాజకీయాలకే కట్టుబడినట్లుగా అర్ధమైపోయింది. మొన్నటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో కూడా కేసీయార్ దివంగత ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే అప్పట్లో సానుభూతి ఓట్లతో పార్టీ చాలా ఈజీగా గెలిచేస్తుందని కేసీయార్ తో పాటు నేతలంతా ఎన్నికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. దాని ఫలితమే ఊహించని డిఫీట్. గెలుపు విషయమై చివరలో టీఆర్ఎస్ అగ్రనేతలకు అనుమానం వచ్చింది. అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అందుకనే సానుభూతి కూడా పనిచేయలేదు. నిజానికి కేసీయార్ జాగ్రత్తగా ఉండుంటే చాలా ఈజీగా గెలవాల్సిన సీటు దుబ్బాక.

సరే అప్పుడు అయ్యిందేదో అయిపోయిందన్న ఉద్దేశ్యంతో దుబ్బాక రిజల్టు మరీ రిపీట్ కావద్దని నేతలకు చెప్పి మరీ కేసీయార్ వారసునికే టికెట్ ఇచ్చారు. సాగర్ నియోజకవర్గంలో యాదవులు పవర్ ఫుల్ అనే చెప్పాలి. అందుకనే నోముల గెలిచారు. అంతమాత్రాన రెడ్లను తేలిగ్గా తీసేసేందుకు లేదు. మొదటినుండి ఇక్కడ రెడ్లదే ఆధిపత్యం. అందుకనే కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు.

మొత్తానికి కేసీయార్ వ్యూహం ప్రకారం సాగర్ ఉపఎన్నికలో రెడ్డి-యాదవ్ ఫైట్ చాలా గట్టిగానే జరిగేట్లుంది. అయితే దుబ్బాకలో దివంగత ఎంఎల్ఏ భార్య లాగ నోముల భగత్ అమాయకుడు కాదట. తండ్రి మంచి జోరుమీదున్నపుడు తండ్రి తరపున భగతే నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టేవారట. పైగా బీఇ+ఎంబిఏ లాంటి డిగ్రీలు చాలానే ఉన్నాయి. అంతకుమించి రాజకీయాలు కొత్తేమీకావు. కాబట్టి ఉపఎన్నికలో గట్టి ఫైటే జరిగేట్లుంది చూస్తుంటే. మొత్తానికి సానుభూతి పనిచేస్తే కేసీయార్ వ్యూహం సక్సెస్ అయినట్లే.

This post was last modified on March 30, 2021 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

22 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

36 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago