అవును నాగార్జునసాగర్ ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య కొడుక్కి టికెట్ ఇవ్వటంతోనే ఈ విషయం అందరికీ అర్దమైపోయింది. నోముల కొడుకు నోముల భగత్ కు కేసీయార్ పార్టీ కార్యాలయంలో బీఫారమ్ అందించారు. దాంతో సాగర్ ఉపఎన్నికలో కూడా కేసీయార్ సానుభూతి రాజకీయాలకే కట్టుబడినట్లుగా అర్ధమైపోయింది. మొన్నటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో కూడా కేసీయార్ దివంగత ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే అప్పట్లో సానుభూతి ఓట్లతో పార్టీ చాలా ఈజీగా గెలిచేస్తుందని కేసీయార్ తో పాటు నేతలంతా ఎన్నికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. దాని ఫలితమే ఊహించని డిఫీట్. గెలుపు విషయమై చివరలో టీఆర్ఎస్ అగ్రనేతలకు అనుమానం వచ్చింది. అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అందుకనే సానుభూతి కూడా పనిచేయలేదు. నిజానికి కేసీయార్ జాగ్రత్తగా ఉండుంటే చాలా ఈజీగా గెలవాల్సిన సీటు దుబ్బాక.
సరే అప్పుడు అయ్యిందేదో అయిపోయిందన్న ఉద్దేశ్యంతో దుబ్బాక రిజల్టు మరీ రిపీట్ కావద్దని నేతలకు చెప్పి మరీ కేసీయార్ వారసునికే టికెట్ ఇచ్చారు. సాగర్ నియోజకవర్గంలో యాదవులు పవర్ ఫుల్ అనే చెప్పాలి. అందుకనే నోముల గెలిచారు. అంతమాత్రాన రెడ్లను తేలిగ్గా తీసేసేందుకు లేదు. మొదటినుండి ఇక్కడ రెడ్లదే ఆధిపత్యం. అందుకనే కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు.
మొత్తానికి కేసీయార్ వ్యూహం ప్రకారం సాగర్ ఉపఎన్నికలో రెడ్డి-యాదవ్ ఫైట్ చాలా గట్టిగానే జరిగేట్లుంది. అయితే దుబ్బాకలో దివంగత ఎంఎల్ఏ భార్య లాగ నోముల భగత్ అమాయకుడు కాదట. తండ్రి మంచి జోరుమీదున్నపుడు తండ్రి తరపున భగతే నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టేవారట. పైగా బీఇ+ఎంబిఏ లాంటి డిగ్రీలు చాలానే ఉన్నాయి. అంతకుమించి రాజకీయాలు కొత్తేమీకావు. కాబట్టి ఉపఎన్నికలో గట్టి ఫైటే జరిగేట్లుంది చూస్తుంటే. మొత్తానికి సానుభూతి పనిచేస్తే కేసీయార్ వ్యూహం సక్సెస్ అయినట్లే.
This post was last modified on March 30, 2021 11:48 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…