ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ల దౌర్జన్యాల్ని.. బెదిరింపుల్ని రికార్డు చేసి పంపితే.. ఒక్కో వీడియోకు రూ.10వేలు చొప్పున పారితోషికాన్ని ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్లు ఎవరైనా అధికార పార్టీకి ఓటు వేయాలని.. లేదంటే సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తామంటూ బెదిరిస్తే ధైర్యంగా రికార్డు చేయాలని కోరారు. అలా రికార్డు చేసిన వాటిని 75575 57744కు పంపాలని కోరారు.
వాటిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ ద్రష్టికి తీసుకెళతామని.. వాలంటీర్లకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. వీడియోల్ని పంపిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు.. అలా వీడియోలు పంపే వారి అకౌంట్లకు రూ.10వేల పారితోషికాన్ని పంపుతామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని వారు ఎవరైనా సరే.. వాట్సాప్ లో సమాచారం పంపితే.. అకౌంట్ కు రూ.10వేల చొప్పున పంపుతామన్నారు. మరి.. అచ్చెన్న పిలుపునకు స్పందన ఎంతలా ఉంటుందో చూడాలి.
This post was last modified on March 30, 2021 11:42 am
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…