ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ల దౌర్జన్యాల్ని.. బెదిరింపుల్ని రికార్డు చేసి పంపితే.. ఒక్కో వీడియోకు రూ.10వేలు చొప్పున పారితోషికాన్ని ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్లు ఎవరైనా అధికార పార్టీకి ఓటు వేయాలని.. లేదంటే సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తామంటూ బెదిరిస్తే ధైర్యంగా రికార్డు చేయాలని కోరారు. అలా రికార్డు చేసిన వాటిని 75575 57744కు పంపాలని కోరారు.
వాటిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ ద్రష్టికి తీసుకెళతామని.. వాలంటీర్లకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. వీడియోల్ని పంపిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు.. అలా వీడియోలు పంపే వారి అకౌంట్లకు రూ.10వేల పారితోషికాన్ని పంపుతామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని వారు ఎవరైనా సరే.. వాట్సాప్ లో సమాచారం పంపితే.. అకౌంట్ కు రూ.10వేల చొప్పున పంపుతామన్నారు. మరి.. అచ్చెన్న పిలుపునకు స్పందన ఎంతలా ఉంటుందో చూడాలి.
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…