ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ల దౌర్జన్యాల్ని.. బెదిరింపుల్ని రికార్డు చేసి పంపితే.. ఒక్కో వీడియోకు రూ.10వేలు చొప్పున పారితోషికాన్ని ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్లు ఎవరైనా అధికార పార్టీకి ఓటు వేయాలని.. లేదంటే సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తామంటూ బెదిరిస్తే ధైర్యంగా రికార్డు చేయాలని కోరారు. అలా రికార్డు చేసిన వాటిని 75575 57744కు పంపాలని కోరారు.
వాటిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ ద్రష్టికి తీసుకెళతామని.. వాలంటీర్లకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. వీడియోల్ని పంపిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు.. అలా వీడియోలు పంపే వారి అకౌంట్లకు రూ.10వేల పారితోషికాన్ని పంపుతామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని వారు ఎవరైనా సరే.. వాట్సాప్ లో సమాచారం పంపితే.. అకౌంట్ కు రూ.10వేల చొప్పున పంపుతామన్నారు. మరి.. అచ్చెన్న పిలుపునకు స్పందన ఎంతలా ఉంటుందో చూడాలి.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…