ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ల దౌర్జన్యాల్ని.. బెదిరింపుల్ని రికార్డు చేసి పంపితే.. ఒక్కో వీడియోకు రూ.10వేలు చొప్పున పారితోషికాన్ని ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్లు ఎవరైనా అధికార పార్టీకి ఓటు వేయాలని.. లేదంటే సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తామంటూ బెదిరిస్తే ధైర్యంగా రికార్డు చేయాలని కోరారు. అలా రికార్డు చేసిన వాటిని 75575 57744కు పంపాలని కోరారు.
వాటిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ ద్రష్టికి తీసుకెళతామని.. వాలంటీర్లకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. వీడియోల్ని పంపిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు.. అలా వీడియోలు పంపే వారి అకౌంట్లకు రూ.10వేల పారితోషికాన్ని పంపుతామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని వారు ఎవరైనా సరే.. వాట్సాప్ లో సమాచారం పంపితే.. అకౌంట్ కు రూ.10వేల చొప్పున పంపుతామన్నారు. మరి.. అచ్చెన్న పిలుపునకు స్పందన ఎంతలా ఉంటుందో చూడాలి.
This post was last modified on March 30, 2021 11:42 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…