విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దివంగత కాపు నేత వంగవీటి రంగా వారసుడిగా అరంగేట్రం చేసిన వంగవీటి రాధా.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత.. ఆయన రాజకీయంగా చేసిన తప్పులు కావొచ్చు.. లేదా.. వేసిన అడుగులు కావొచ్చు.. ఆయనకు రాజకీయ ఫ్యూచర్ లేకుండా చేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారు ? అనే విజయవాడలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో రాధా హవా పెద్దగా ఎక్కడా కనిపించలేదు.
వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీలో పెద్ద గందరగోళమే జరిగింది. ఎంపీ వర్సెస్ ఇతర నేతలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో రాధా ఎక్కడా బయటకురాకపోవడం గమనార్హం. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అప్పట్లో కొందరు చెప్పినా.. ఆదిశగా కూడా రాధా ఎక్కడా దృష్టి పెట్టలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు రాధా పేరుకూడా ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. దీంతో రాధాను పార్టీనే దూరం పెట్టిందా? లేక రాధానే దూరమయ్యారా? అనే చర్చ కూడా కొన్ని రోజులు సాగింది. ఏదైతేనేం.. పార్టీ విజయవాడలో కార్పొరేషన్ను దక్కించుకోలేక పోయింది.
ఇదిలావుంటే. ఇప్పుడు రాధా పొలిటికల్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇప్పటికే విజయవాడ టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎంపీ కేశినేని నాని ఒక వర్గంగాను, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. తదితరులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఇక, ఎవరికీ కాకుండా.. మరొకొందరు ఎవరికి వారే చక్రం తిప్పుతున్నారు.. ఈ క్రమంలో రాధా ఏ వర్గానికి చెందిన నాయకుడు ? అనేది ప్రశ్న. పోనీ.. తనే ఒంటరిగా చక్రం తిప్పుతారా? అంటే.. టీడీపీ శ్రేణులు కలిసిరావడం లేదు.
ఆయన మనసంతా సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. ఎప్పటకి అయినా అక్కడ పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అవ్వాలన్నదే ఆయన కోరిక. అయితే సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సైతం రాధాను అక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజధాని అమరావతికి మద్దతుగా కొన్నాళ్లు వరకు మాట్లాడినా.. తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా .. విషయం రాజకీయంగా ఎటు మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on March 30, 2021 11:48 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…