విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దివంగత కాపు నేత వంగవీటి రంగా వారసుడిగా అరంగేట్రం చేసిన వంగవీటి రాధా.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత.. ఆయన రాజకీయంగా చేసిన తప్పులు కావొచ్చు.. లేదా.. వేసిన అడుగులు కావొచ్చు.. ఆయనకు రాజకీయ ఫ్యూచర్ లేకుండా చేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారు ? అనే విజయవాడలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో రాధా హవా పెద్దగా ఎక్కడా కనిపించలేదు.
వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీలో పెద్ద గందరగోళమే జరిగింది. ఎంపీ వర్సెస్ ఇతర నేతలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో రాధా ఎక్కడా బయటకురాకపోవడం గమనార్హం. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అప్పట్లో కొందరు చెప్పినా.. ఆదిశగా కూడా రాధా ఎక్కడా దృష్టి పెట్టలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు రాధా పేరుకూడా ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. దీంతో రాధాను పార్టీనే దూరం పెట్టిందా? లేక రాధానే దూరమయ్యారా? అనే చర్చ కూడా కొన్ని రోజులు సాగింది. ఏదైతేనేం.. పార్టీ విజయవాడలో కార్పొరేషన్ను దక్కించుకోలేక పోయింది.
ఇదిలావుంటే. ఇప్పుడు రాధా పొలిటికల్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇప్పటికే విజయవాడ టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎంపీ కేశినేని నాని ఒక వర్గంగాను, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. తదితరులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఇక, ఎవరికీ కాకుండా.. మరొకొందరు ఎవరికి వారే చక్రం తిప్పుతున్నారు.. ఈ క్రమంలో రాధా ఏ వర్గానికి చెందిన నాయకుడు ? అనేది ప్రశ్న. పోనీ.. తనే ఒంటరిగా చక్రం తిప్పుతారా? అంటే.. టీడీపీ శ్రేణులు కలిసిరావడం లేదు.
ఆయన మనసంతా సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. ఎప్పటకి అయినా అక్కడ పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అవ్వాలన్నదే ఆయన కోరిక. అయితే సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సైతం రాధాను అక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజధాని అమరావతికి మద్దతుగా కొన్నాళ్లు వరకు మాట్లాడినా.. తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా .. విషయం రాజకీయంగా ఎటు మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on March 30, 2021 11:48 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…