Political News

బీజేపీకి ఇష్యూయే దొరకటంలేదా ?

వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజమట. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి, రాష్ట్రంలో తామే ఇఫుడు నిజమైన ప్రతిపక్షమని గొంతుచించుకునే పార్టీకి ఇష్యు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తరపున రత్నప్రభ పోటీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు సమస్యేమిటంటే కమలంపార్టీకి అభ్యర్ధే పెద్ద మైనస్.

ఎందుకంటే అభ్యర్ధి పార్టీ నేతల్లోనే చాలామందికి పరిచయమే లేదు. నేతలకే పరిచయం లేదంటే ఇక మామూలు జనాలగురించి చెప్పాల్సిన పనేముంది ? అందుకే పార్టీ అనేక సమస్యలను ఫేస్ చేస్తోంది. ముందు అభ్యర్ధిగురించి పరిచయటం చేయటంతోనే నేతలకు సమయం సరిపోతోంది. తర్వాత రాష్ట్రానికి పార్టీ ఏమి చేసింది ? ప్రత్యేకంగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏమైనా చేసిందా ? అనే విషయాలను హైలైట్ చేయాలి.

కేంద్రం తరపున రాష్ట్రానికి ఏమైనా జరిగుంటే దాన్ని చెప్పుకోవటానికి ఏమీలేకపోగా అతిపెద్ద మైనస్ పాయింట్లు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలో ఏడేళ్ళ క్రితం కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన మేలేమీలేదు. పైగా రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బకొట్టేస్తోంది. ముందు విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేకహోదా, విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ను తుంగలో తొక్కేసింది.

ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినవని అనుకుంటే తాజాగా వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేసేసింది. తర్వాత గంగవరం పోర్టు నిర్మాణం తన బాధ్యత కాదని తప్పించుకుంది. ఇలా ఎక్కడికక్కడ ఏపిని దెబ్బకొడుతున్న బీజేపీకి జనాలు ఎలా ఓట్లేస్తారనే అంశం నేతలను పట్టి పీడిస్తోందట. ఎందుకంటే మొన్నటి వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే జనాలు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో ను ప్రచారంలో ఉతికి ఆరేశారు. దాంతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి జెండా ఎత్తేశారు.

మరి ఇదే సమస్య ఇపుడు తిరుపతి లోక్ సభ ప్రచారంలో కూడా ఎదురవుతోందట. ఏపి ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బకొడుతున్న బీజేపీకి ఎందుకు ఓట్లేయాలని జనాలు నిలదీస్తున్నారట. వారికి సమాధానం చెప్పుకోలేక కమలనాదులు నానా అవస్తలు పడుతున్నారు. నామినేషన్ కు ముందే జనాలకు సమాధానాలు చెప్పుకోలేని నేతలు రేపు ఎన్నికల వేడి రాజుకుందంటే ఇంకేమని ప్రచారం చేయగలరబ్బా ?

This post was last modified on March 29, 2021 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

20 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago