Political News

ఏపిలో మళ్ళీ హై అలర్ట్ ?

కరోనా సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రాత్రుళ్ళు కర్ఫ్యూ, రాత్రిళ్ళు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య అయితే పెరిగిపోతున్నాయి. ఇపుడీ ఈ జాబితాలో ఏపి కూడా చేరుతున్నట్లే ఉంది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వెయ్యికేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు నిర్వహించిన 31142 కేసుల్లో 1005 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అవ్వటం సంచలనంగా మారింది. ఇంతకుముందు అంటే గడచిన 15 రోజులుగా ప్రతిరోజు వందల్లో మాత్రమే నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా వెయ్యిమార్కును దాటడం ఆశ్చర్యంగా ఉంది.

అలాగే గడచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణాజిల్లాల్లో చెరోకరు కరోనా వైరస్ కారణంగానే మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారిసంఖ్య 7205కి చేరుకున్నది. నిజానికి ఈ సంఖ్య పెద్దదనే చెప్పాలి. అయితే ప్రభుత్వం తీసుకున్న అనేక ముందస్తు, కఠిన చర్యల కారణంగానే సంఖ్య ఇంతటితో ఆగింది. లేకపోతే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ,తమిళనాడు, కర్నాటకలతో పోటీపడుతుండేది. ఇదే సమయంలో కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 8,86,216గా నమోదైంది.

గడచిన 24 గంటల్లో ఎక్కువగా నమోదైన కేసులు నాలుగు జిల్లాలో కనబడుతున్నాయి. గుంటూరులో అత్యధికంగా 225 మంది కరోనా బారినపడ్డారు. తర్వాత స్ధానాల్లో చిత్తరు జిల్లాలో 187 కేసులు విశాఖపట్నంలో 167, కృష్ణాజిల్లాలో 135 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కూడా 84 కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద కొద్దో గొప్పో కేసులు ప్రతి జిల్లాలోను నమోదవ్వటమే యంత్రాంగాన్ని టెన్షన్ లోకి నెట్టేస్తోంది. మొత్తంమీద మళ్ళీ తొందరలోనే రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించేట్లే ఉంది.

This post was last modified on March 29, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

46 minutes ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

2 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

2 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

4 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

5 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

5 hours ago