Political News

ఏపిలో మళ్ళీ హై అలర్ట్ ?

కరోనా సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రాత్రుళ్ళు కర్ఫ్యూ, రాత్రిళ్ళు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య అయితే పెరిగిపోతున్నాయి. ఇపుడీ ఈ జాబితాలో ఏపి కూడా చేరుతున్నట్లే ఉంది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వెయ్యికేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు నిర్వహించిన 31142 కేసుల్లో 1005 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అవ్వటం సంచలనంగా మారింది. ఇంతకుముందు అంటే గడచిన 15 రోజులుగా ప్రతిరోజు వందల్లో మాత్రమే నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా వెయ్యిమార్కును దాటడం ఆశ్చర్యంగా ఉంది.

అలాగే గడచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణాజిల్లాల్లో చెరోకరు కరోనా వైరస్ కారణంగానే మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారిసంఖ్య 7205కి చేరుకున్నది. నిజానికి ఈ సంఖ్య పెద్దదనే చెప్పాలి. అయితే ప్రభుత్వం తీసుకున్న అనేక ముందస్తు, కఠిన చర్యల కారణంగానే సంఖ్య ఇంతటితో ఆగింది. లేకపోతే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ,తమిళనాడు, కర్నాటకలతో పోటీపడుతుండేది. ఇదే సమయంలో కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 8,86,216గా నమోదైంది.

గడచిన 24 గంటల్లో ఎక్కువగా నమోదైన కేసులు నాలుగు జిల్లాలో కనబడుతున్నాయి. గుంటూరులో అత్యధికంగా 225 మంది కరోనా బారినపడ్డారు. తర్వాత స్ధానాల్లో చిత్తరు జిల్లాలో 187 కేసులు విశాఖపట్నంలో 167, కృష్ణాజిల్లాలో 135 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కూడా 84 కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద కొద్దో గొప్పో కేసులు ప్రతి జిల్లాలోను నమోదవ్వటమే యంత్రాంగాన్ని టెన్షన్ లోకి నెట్టేస్తోంది. మొత్తంమీద మళ్ళీ తొందరలోనే రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించేట్లే ఉంది.

This post was last modified on March 29, 2021 10:19 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago