భారతదేశం ఇక లాక్ డౌన్ నుంచి బయటకు రావడానికి పూర్తిగా సిద్ధమైపోయినట్టే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సడలింపులతో మెల్లగా కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ వచ్చిన కేంద్రం ఈ రోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. మే 12 నుంచి సాధారణ ప్రజలకు రైళ్లు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం దీనిని ఆమోదించింది. ఇది సడెన్ సర్ ప్రైజ్ అని చెప్పాలి.
ఎందుకంటే లాక్ డౌన్ తీసేసినా రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు చాలా ఆలస్యంగా ప్రారంభిస్తారని అందరూ భావించారు. కానీ ఇలా ఉంటే ఎకానమీ ఎన్నటికీ కోలుకోలేదని… ప్రయాణాలు నిషేధించినంత కాలం లాక్ డౌన్ తీసేసినా ఉపయోగం ఉండదని భావించిన కేంద్రం రైళ్ల ప్రయాణాలకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ… రేపటి నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని, ఎల్లుండి నుంచి రైళ్లు నడుస్తాయని పేర్కొంది.
అయితే, దేశమంతటా అన్ని రైళ్లు ప్రారంభించడం లేదు. ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే ప్రస్తుతం 15 రైళ్లను తొలిదశలో నడుపుతారు. తద్వారా ప్రయాణాల్లో భౌతిక దూరం, మాస్కులు, ప్రయాణికుల రక్షణ వంటివన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. తదనంతరం ప్రారంభయమయ్యే అన్ని రైళ్లకు ఇవే నిబంధనలు ఉంటాయి.
ఈ రైళ్లు ఢిల్లీ నుంచి కింది ప్రాంతాలకు నడుస్తాయి
వీటికి రేపు సాయంత్రం 4 గంట నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చు.
This post was last modified on May 10, 2020 9:03 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…