భారతదేశం ఇక లాక్ డౌన్ నుంచి బయటకు రావడానికి పూర్తిగా సిద్ధమైపోయినట్టే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సడలింపులతో మెల్లగా కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ వచ్చిన కేంద్రం ఈ రోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. మే 12 నుంచి సాధారణ ప్రజలకు రైళ్లు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం దీనిని ఆమోదించింది. ఇది సడెన్ సర్ ప్రైజ్ అని చెప్పాలి.
ఎందుకంటే లాక్ డౌన్ తీసేసినా రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు చాలా ఆలస్యంగా ప్రారంభిస్తారని అందరూ భావించారు. కానీ ఇలా ఉంటే ఎకానమీ ఎన్నటికీ కోలుకోలేదని… ప్రయాణాలు నిషేధించినంత కాలం లాక్ డౌన్ తీసేసినా ఉపయోగం ఉండదని భావించిన కేంద్రం రైళ్ల ప్రయాణాలకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ… రేపటి నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని, ఎల్లుండి నుంచి రైళ్లు నడుస్తాయని పేర్కొంది.
అయితే, దేశమంతటా అన్ని రైళ్లు ప్రారంభించడం లేదు. ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే ప్రస్తుతం 15 రైళ్లను తొలిదశలో నడుపుతారు. తద్వారా ప్రయాణాల్లో భౌతిక దూరం, మాస్కులు, ప్రయాణికుల రక్షణ వంటివన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. తదనంతరం ప్రారంభయమయ్యే అన్ని రైళ్లకు ఇవే నిబంధనలు ఉంటాయి.
ఈ రైళ్లు ఢిల్లీ నుంచి కింది ప్రాంతాలకు నడుస్తాయి
వీటికి రేపు సాయంత్రం 4 గంట నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చు.
This post was last modified on May 10, 2020 9:03 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…