Political News

సంచలనం… ఎల్లుండి నుంచి రైళ్లు పరుగెడతాయి

భారతదేశం ఇక లాక్ డౌన్ నుంచి బయటకు రావడానికి పూర్తిగా సిద్ధమైపోయినట్టే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సడలింపులతో మెల్లగా కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ వచ్చిన కేంద్రం ఈ రోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. మే 12 నుంచి సాధారణ ప్రజలకు రైళ్లు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం దీనిని ఆమోదించింది. ఇది సడెన్ సర్ ప్రైజ్ అని చెప్పాలి.

ఎందుకంటే లాక్ డౌన్ తీసేసినా రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు చాలా ఆలస్యంగా ప్రారంభిస్తారని అందరూ భావించారు. కానీ ఇలా ఉంటే ఎకానమీ ఎన్నటికీ కోలుకోలేదని… ప్రయాణాలు నిషేధించినంత కాలం లాక్ డౌన్ తీసేసినా ఉపయోగం ఉండదని భావించిన కేంద్రం రైళ్ల ప్రయాణాలకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ… రేపటి నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని, ఎల్లుండి నుంచి రైళ్లు నడుస్తాయని పేర్కొంది.

అయితే, దేశమంతటా అన్ని రైళ్లు ప్రారంభించడం లేదు. ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే ప్రస్తుతం 15 రైళ్లను తొలిదశలో నడుపుతారు. తద్వారా ప్రయాణాల్లో భౌతిక దూరం, మాస్కులు, ప్రయాణికుల రక్షణ వంటివన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. తదనంతరం ప్రారంభయమయ్యే అన్ని రైళ్లకు ఇవే నిబంధనలు ఉంటాయి.

ఈ రైళ్లు ఢిల్లీ నుంచి కింది ప్రాంతాలకు నడుస్తాయి

  1. దిబ్రూఘర్
  2. అగర్తలా
  3. హౌరా
  4. పాట్నా
    5.బిలాస్ పూర్
  5. రాంచి
  6. భువనేశ్వర్
  7. సికింద్రాబాద్
  8. బెంగుళూరు
    10.చెన్నై
  9. త్రివేండ్రం
  10. మడగావ్
  11. ముంబై సెంట్రల్
  12. అహ్మదాబాద్
  13. జమ్ముతావి.

వీటికి రేపు సాయంత్రం 4 గంట నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చు.

This post was last modified on May 10, 2020 9:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago