Political News

ఎంఎల్ఏని చితక్కొట్టేసిన రైతులు

మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోందా ? క్షేత్రస్ధాయిలో తాజాగా జరిగిన ఘటన చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. పంజాబ్ లో బీజేపీ ఎంఎల్ఏపై రైతులు దాడిచేసి బాగా కొట్టారు. అంతేకాకుండా ఆయన బట్టలను చీలికలు పీలికలుగా చించేయటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.

చిన్న ఆందోళనగా మొదలైన డిమాండ్లు చివరకు ఇపుడు పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందింది. గడచిన నాలుగు నెలలుగా ఢిల్లీ శివార్లలోని సింఘూ తదితర ప్రాంతాల్లో పట్టువిడవకుండా భారత్ కిసార్ సంఘ్ ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు తమ ఉద్యమాన్ని కంటిన్యు చేస్తున్నారు. ఆందోళనకైనా, ఉద్యమానికైనా కేంద్ర బిందువు పంజాబే అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

అలాంటి పంజాబ్ లో ఉద్యమం మరింత ఉగ్రరూపంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగానే స్ధానిక బీజేపీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే ముక్తసర్ జిల్లాలోని మాలోట్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు ఎంఎల్ఏ అరుణ్ నారంగ్ రెడీ అయ్యారు. ఎంఎల్ఏ వచ్చిన విషయం తెలుసుకున్న రైతుల్లో కొందరు హఠాత్తుగా మీడియా సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు.

ఎంఎల్ఏతో పాటు ఆయన వాహనాలు,మద్దతుదారులపై నల్లరంగు చల్లి తమ నిరసన తెలిపారు. అయితే నల్లరంగు చల్లే క్రమంలో మద్దతుదారులకు రైతులకు గొడవ మొదలైంది. చివరకు ఈ గొడవ కాస్త పెద్దదై ఏకంగా ఎంఎల్ఏపైన దాడి చేసేదాకా వెళ్ళింది. సెక్యురిటి, మద్దతుదారులు ఎంఎల్ఏకి రక్షణగా నిలిచినా రైతులు వదల్లేదు. ఆయనపై దాడిచేసి బట్టలను చింపేశారు. మొత్తానికి ఎలాగో అక్కడినుండి తప్పించుకుని రైతులపై ఎంఎల్ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశారు.

This post was last modified on March 28, 2021 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

14 minutes ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

48 minutes ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

2 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

4 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

8 hours ago

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…

8 hours ago