Political News

ఏపీ సీన్ రివ‌ర్స్‌.. హీటెక్కిస్తున్న‌ కేసీఆర్ కామెంట్లు

ఈ విష‌యంపై చ‌ర్చించే ముందు.. కొంచెం లోతుగా ప‌రిశీలించాల్సి.. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితికి.. కొన్నాళ్ల కింద‌ట‌కి ఏం జ‌రిగిందో చూద్దాం..
రెండేళ్ల కింద‌ట‌:
హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌తో గుంటూరు, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, విశాఖ హోట‌ళ్లు కిట‌కిట‌లాడాయి. ఎక్క‌డ చూసినా.. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. ఎవ‌రిని క‌దిలించినా.. మా భూమికి మంచి ధ‌ర వ‌చ్చిందండి! అనే మాట త‌ప్ప‌.. మేం న‌ష్ట‌పోయాం అనే మాటే లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఏర్ప‌డ‌డం.. దీనికి సంబంధించిన అంచ‌నాలు జోరుగా ప్ర‌చారం కావ‌డం. ప్ర‌పంచ స్థాయి సామ‌ర్థ్యం.. ఉన్న కంపెనీలు ఇక్క‌డ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావ‌డ‌మే. దీంతో తెలంగాణ‌లోని భూముల ధ‌ర‌ల‌తో పోలిస్తే.. ఏపీలో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు తొడిగాయి. అక్క‌డ నాలుగు ఎక‌రాలు అమ్మితే.. ఏపీలొ ఒక ఎక‌రం కొనే ప‌రిస్థితి!!

ఇప్పుడు:
తెలంగాణ అసెంబ్లీలోనే కేసీఆర్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఏపీలో సీన్ రివ‌ర్స్ అయింది. ఒక‌ప్పుడు ఇక్క‌డ నాలుగు ఎక‌రాలు అమ్మితే.. ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎక‌రం కొన‌డం క‌ష్ట‌మ‌య్యేది. కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల కార‌ణంగా.. ఇక్క‌డ భూముల‌కు రెక్క‌లు వ‌స్తున్నాయి. ఏపీ ప‌ని రివ‌ర్స్ అయింది. ఇక్క‌డ ఎక‌రం అమ్మితే.. అక్క‌డ నాలుగు ఎక‌రాలు కొనొచ్చు!!

అస‌లు సంగ‌తి!!
కేసీఆర్ కామెంట్ల‌ను తేలిక‌గా తీసుకునే ప‌నిలేదు. చాలా వ్యూహాత్మ‌కంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. కేవ‌లం ఆయ‌న భూముల‌ను రియ‌ల్ ఎస్టేట్‌ను మాత్ర‌మే పోల్చి చెప్పిన మాట‌లు కావు అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం జ‌గ‌న్ ప‌నితీరుతో ఏపీ ప‌రిస్థితి అప్పుల పాలు అయిపోయింద‌ని.. ఇప్ప‌టికే ఆర్థిక వ‌ర్గాల నుంచి విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ‌ధాని విష‌యం కూడా గంద‌ర‌గోళంలో ప‌డ‌డంతో రియ‌ల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బ‌తిని.. భూముల ధ‌ర‌లు అమాంతం ప‌డిపోయాయి. ఫ‌లితంగా భ‌వ‌న నిర్మాణ రంగం మ‌రింత‌గా అగాధంలోకి ప‌డిపోయింది.

ఇక‌, ఎక్క‌డా పెట్టుబ‌డుటలు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. సో.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశాజ‌న‌మైన రాష్ట్రం.. పెట్టుబ‌డుల ప‌రంగా.. పాల‌న ప‌రంగా అభివృద్ధిలో ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే! అనే కీల‌క సందేశాన్ని.. ప్ర‌చారాన్ని క‌ల్పించేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ లోపాల‌ను, ఏపీ ప‌రిస్థితిని చెప్ప‌క‌నే అసెంబ్లీలో చెప్పార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 27, 2021 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago