Political News

షర్మిల ధీమానే వేరు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల నోటి నుంచి వస్తున్న మాటలు అందరిని ఆకర్షించేలా ఉంటున్నాయి. ప్రజాజీవితంలోకి రావాలనుకునే వారు.. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న విషయాన్ని ఆమెను చూసి నేర్చుకోవాలన్న మాట వినిపిస్తోంది. పార్టీని పెడతానని చెప్పిన రోజు నుంచి.. ప్రతి రోజు ఏదోఒక కార్యక్రమాన్ని నిర్వహించటం.. తాను చెప్పాల్సిన మాటల్ని చెప్పటం కనిపిస్తుంది. అంతేకాదు.. వారంలో ఒకరోజు అయినా పార్టీకి సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వచ్చే నెల 9నఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్న ఆమె.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నివిషయాల్ని ఒకేసారి చెప్పకుండా.. వ్యూహాత్మకంగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కో రోజున.. వివిధ వేదికల మీద మాట్లాడటం ద్వారా.. తమ పార్టీకి సంబంధించిన విషయాల్ని కొత్తగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా కీలక వ్యాఖ్య చేశారు.

రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలోని ఏ పార్టీతోనూ తాము పొత్తులు పెట్టుకునేది లేదని.. సొంతంగానే పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ అడిగితేనో.. బీజేపీ పంపితేనో తాను తెలంగాణకు రాలేదన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. రాజన్న సంక్షే పాలనను మళ్లీ తీసుకురావటమే తన లక్ష్యంగా చెబుతున్న ఆమె.. ఖమ్మం జిల్లా ఉమ్మడి నేతలతో భేటీ అయ్యారు. తాజాగా నిర్వహించే సభకు సంకల్ప సభ పేరుతో పోస్టర్ ను విడుదల చేశారు.

తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసేందుకు తానెందుకు సంకల్పం తీసుకున్నది తాను ఏప్రిల్ 9న జరిగే సభలో వివరిస్తానంటూ ఆసక్తిని పెంచారు. ప్రతి రోజు పార్టీకి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం ఉండేలా.. ఏదో ఒక జిల్లాకు చెందిన వారితో.. ఏదైనా వర్గానికి చెందిన వారినో కలుసుకోవటం.. భారీ బజ్ కు ముందు అవసరమైన గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకునే ధోరణి షర్మిల మాటల్లోనూ.. చేతల్లోనూ కనిపిస్తుందని చెప్పాలి. ఆమెను లెక్కలోకి వేసుకోవాల్సిన అవసరం లేదన్న వారికి తగిన షాక్ ఇచ్చేలా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్న మాట మరింత ఆసక్తికరంగా మారింది. మరేం చేస్తారో చూడాలి.

This post was last modified on March 26, 2021 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

23 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago