Political News

ఎయిర్ పోర్టు ఓపెనింగ్.. కీలక వ్యాఖ్య చేసిన జగన్

ఒక ఎయిర్ పోర్టుకు రెండు ప్రారంభోత్సవాలా? అంటూ కొందరి విమర్శల నడుమ.. కర్నూలుకు దగ్గర్లోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏళ్లకు ఏళ్లుగా కర్నూలు ఎయిర్ పోర్టు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కల నేటికి తీరింది. చంద్రబాబు హయాంలోనే నిర్మాణం మొదలై పూర్తి చేసుకున్న ఈ ఎయిర్ పోర్టులో మరో మూడు రోజుల్లో ప్రయాణికుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ రాజధానికి రాకపోకలు సాగేలా ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీంతో.. మూడు రాజధానుల అంశంపై తాను పక్కకు వెళ్లలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు..రానున్న రోజుల్లో ఏపీ హైకోర్టు తరలింపు ఖాయమన్నసంకేతాల్ని ఇచ్చినట్లైంది.

తాజాగా ప్రారంభించిన విమానాశ్రయంతో రాష్ట్రంలో ఆరో విమానాశ్రయంగా పేర్కొన్న జగన్.. న్యాయ రాజధాని నుంచి మిగిలిన రాష్ట్రాలకు ఓర్వకల్లు విమానాశ్రయం కలుపుతుందన్నారు. అంతేకాదు.. ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టటం ద్వారా భావోద్వేగ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఎయిర్ పోర్టు ప్రారంభం కాక ముందే.. ఎన్నికల్లో లబ్థి పొందేందుకు చంద్రబాబు ఎయిర్ పోర్టును ప్రారంభించినట్లుగా విమర్శలు సంధించారు. రూ.110 కోట్లతో అన్ని హంగుల్ని ఎయిర్ పోర్టు తీర్చిదిద్దినట్లు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. రెండేళ్ల క్రితమే చంద్రబాబు ఓపెన్ చేస్తే.. ఇన్నాళ్లకు ఎందుకు ప్రారంభించినట్లు? ముందే ఈ పని ఎందుకు కానట్లు? అన్న ప్రశ్నకు జగన్ ఏమని బదులిస్తారో?

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

3 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

3 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

4 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

5 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

5 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

6 hours ago