Political News

రాహుల్ వ్యూహాత్మక ప్రచారం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో ప్రధానంగా తమిళనాడు, కేరళపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. కొద్దికాలం ముందునుండే రాహూల్ యువతను టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించచ్చు. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ మహిళా కళాశాలలో చాలాసేపు గడిపారు. అక్కడి విద్యార్ధినులకు మార్షల్స్ ఆర్ట్స్ శిక్షణలో టిప్ప్ నేర్పించారు.

జపనీస్ మార్షల్స్ ఆర్ట్స్ ఐకిడో టిప్స్ నేర్పడం కోసం దాదాపు గంటపాటు కళాశాలలోనే ఉడిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటల కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతం యువతతో ఇప్పటికే రెండు మూడుసార్లు మాట్లాడారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వంటలను అందరికీ రుచిచూపించే విషయంలో కొందరు యూట్యూబర్లతో కలిసి వంటలు చేశారు.

అలాగే జాలర్ల సమస్యలు తెలుసుకునేందుకు, సమస్యల పరిష్కారం పేరుతో కొందరు జాలర్లతో కలిసి చాలాసేపు సముద్రంలో ఈతకొట్టారు. తమిళనాడు, కేరళలో కలిపి సుమారు ఇప్పటికి 30 కళాశాలల్లోని విద్యార్ధులతో రాహూల్ వివిధ సమావేశాలు నిర్వహించారు. అంటే రాహూల్ పర్యటనలను చూస్తుంటే ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేసిన విషయం అర్ధమైపోతోంది.

ఎన్నికల ప్రచారంలో రోడ్డుషోలు, బహిరంగసభలు, వీధి ప్రచారాల్లో ఒకవైపు సీనియర్ నేతలతో కలిసి బిజీగా ఉంటూనే మరోవైపు చాలాకొద్ది మందితో కలిసి కళాశాలల్లో తిరుగుతున్నారు. ఇదే పద్దతిని అస్సాం పర్యటనల్లో కూడా అమలు చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్ పర్యటన విషయంలో మాత్రం ఎందుకనో అంతగా యాక్టివ్ గా కనబడటంలేదు.

అయితే అస్సాంలో ప్రచారం విషయంలో మాత్రం తన సోదరి ప్రియాంక గాంధి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. చూడబోతే రాహూల్, ప్రియాంకలు తమిళనాడు, కేరళ, అస్సాంపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు అర్ధమైపోతోంది. మరి వీళ్ళ కష్టం ఫలిస్తుందా ?

This post was last modified on March 23, 2021 1:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పురందేశ్వ‌రి సైలెంట్‌గా ప‌ని మొద‌లెట్టేశారా..!

కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ త‌న‌ ప‌ని ప్రారంభిస్తోందా? సైలెంట్‌గా త‌న ఓటు బ్యాంకును పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోందా?…

37 minutes ago

2018 ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. అతనికి ఉరిశిక్ష

తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ…

1 hour ago

చిన్ననాటి స్నేహితుడితో హిరోయిన్ నిశ్చితార్థం

ప్రస్తుతం రీ రిలీజ్‌తో సందడి చేస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రమే కాక కింగ్, శంభో శివ శంభో,…

1 hour ago

మూడో సంతానం ఉందా?… అయితే రూ.50 వేలు మీవే!

మొన్నటిదాకా ఇద్దరు పిల్లలు ముద్దు…అంతకు మించి వద్దు అనేది నినాదం. ఇప్పుడు ఎంత మంది వీలయితే అంత మంది పిల్లలను…

2 hours ago

ఇండియా విజయం.. పాక్ బాధ అంతా ఇంతా కాదు

ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి గాల్లో తేలిపోతున్నారు. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్, బోర్డర్-గావస్కర్…

2 hours ago

ఆమె దర్శకత్వంలో సమంత మళ్లీ…

సమంత కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘ఓ బేబీ’ ఒకటి. ఒక కొరియన్ మూవీకి రీమేక్‌ అయినప్పటికీ... మన…

2 hours ago