తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినప్పటి నుంచి బీజేపీ నేతలు చేస్తోన్న హంగామాకు అంతే లేదు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గోషామహాల్ సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా వచ్చిన గెలుపు చూసుకుని తెగ ఎగిరిపడింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయినా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో 48 డివిజన్లలో గెలుపుతో మళ్లీ హంగామా స్టార్ట్ చేసింది. నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే అంటూ గొప్పలు ప్రారంభించేసింది. అయితే తెలంగాణలో ఎప్పుడూ ఏదో ఒక అంశంతో సంచలనాలు మాత్రమే నమోదు చేస్తోన్న బీజేపీకి క్షేత్రస్థాయిలో ఎంత మాత్రం బలం లేదని.. ఆపార్టీది కేవలం బలుపు మాత్రమే అని.. వాపు కాదని తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పేశాయి.
తెలంగాణ బీజేపీ కలలు కరిగిపోయాయి. ఆ పార్టీకి ఏదైనా పట్టు ఉంటే అది విద్యావంతుల్లోనే ఉండాలి. అలాంటిది తాజా ఎమ్మెల్సీ ఫలితాల్లో అదే విద్యావంతులు, ఉద్యోగులే బీజేపీకి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయింది. ఇక నల్గొండ నియోజకవర్గంలో అయితే మరీ ఘోరంగా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. విద్యావంతుల్లోనే ఆ పార్టీకి పట్టులేదన్నది నిరూపితమవ్వగా.. ఇక సాధారణ ప్రజల్లో ఎంతో బలం ఉందని ఊహించుకోవడం కూడా భ్రమే అవుతుంది. తెలంగాణలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం, ఏపీకి చేస్తోన్న అన్యాయం ఆ పార్టీని అధః పాతాళానికి తొక్కి పడేశాయి. ఏపీలో బీజేపీని ఎవ్వరూ నాశనం చేయకుండా ఆ పార్టీకి ఆ పార్టీయే కావాల్సినంత లోతులో బొంద పెట్టేసుకుంది.
పార్టీకి కాస్తో కూస్తో ఆశలు ఉన్న తెలంగాణలో అది కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగో స్ధానంలో ఉందంటే.. ఇక తిరుపతిలో కూడా ఖచ్చితంగా మూడో స్థానమే గతి అవుతుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ ఇక్కడ పోటీ వైసీపీ వర్సెస్ తెలుగుదేశం మధ్యే అన్నది క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ అధికార మదం చూసుకుని తెలంగాణ బీజేపీ నాయకులు ఇక్కడ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పసలేని విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారే తప్పా.. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నదానిపై దృష్టి పెట్టలేదు. అందుకే ఇప్పుడు బీజేపీ బలుపు బుడగ పేలిపోయింది.
This post was last modified on March 20, 2021 9:11 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…