Political News

జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసిన విజయసాయి క్వశ్చన్

తరచూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పలు వర్గాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలైతే.. పూనకం వచ్చినట్లుగా అధినేత నిర్ణయాల్ని మెచ్చుకుంటుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే జగన్ సర్కారు ఇలా చేస్తుందా? అన్న భావన కలుగక మానదు.

రాష్ట్రం ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. దానికి తోడు డెవలప్ మెంట్ పనులు కూడా అంతే జోరుగా జరగాలి. ఏ ఒక్కటి నిలిచినా ఇబ్బందే. అయితే.. ఈ పాయింట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరిగా అర్థం చేసుకోనట్లుగా ఉంది. తన పేరుతోనో.. తాను డిసైడ్ చేసిన పేరుతోనూ అమలు చేసే సంక్షేమ పథకాలకు కొత్త కొత్త పేర్లు పెట్టి.. వాటిని ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని.. సినిమాల విడుదలకు ముందు రిలీజ్ చేసే టీజర్ల మాదిరి.. జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ సర్కారు తీరు కారణంగా ఏపీలో చేపట్టాల్సిన వేలాది కోట్ల రైల్వే పనులు నిలిచిపోయిన షాకింగ్ నిజాన్ని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రం తన వంతుగా ఇవ్వాల్సిన వాటాను చెల్లించిన తర్వాతే తాము పనులు మొదలుపెడతామన్నారు. ఈ సమాధానం జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేంద్రమంత్రి ఈ మాట చెప్పటానికి కారణమైన ప్రశ్నను వేసింది మరెవరో కాదు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రూ.1636 కోట్లు ఇవ్వని కారణంగా రూ.10వేల కోట్ల విలువైన రైల్వేపనులు నిలిచిపోయినట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వ తీరు కారణంగా 841కి.మీ. మేర నాలుగులైన్ల పనులు ఆగాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నోట మాట విన్నంతనే విస్మయానికి గురి కావటం ఖాయం.
ఎందుకంటే..జగన్ ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలు.. ఇంతకు మించే ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రానికి ఇవ్వాల్సిన రాష్ట్రం వాటా ఇచ్చేస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుంది కదా? అలాంటివి జగన్ ఎందుకు మర్చిపోయినట్లు? అన్నది ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎంకు కళ్లు.. చెవులుగా ఉండే విజయసాయి రెడ్డి స్వయంగానే తానే ఈ ప్రశ్నను సంధించటం గమనార్హం. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసేలా ఈ క్వశ్చన్ చేయటం ఆసక్తికరంగా మారింది.

This post was last modified on March 20, 2021 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

8 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

48 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago