Political News

జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసిన విజయసాయి క్వశ్చన్

తరచూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పలు వర్గాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలైతే.. పూనకం వచ్చినట్లుగా అధినేత నిర్ణయాల్ని మెచ్చుకుంటుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే జగన్ సర్కారు ఇలా చేస్తుందా? అన్న భావన కలుగక మానదు.

రాష్ట్రం ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. దానికి తోడు డెవలప్ మెంట్ పనులు కూడా అంతే జోరుగా జరగాలి. ఏ ఒక్కటి నిలిచినా ఇబ్బందే. అయితే.. ఈ పాయింట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరిగా అర్థం చేసుకోనట్లుగా ఉంది. తన పేరుతోనో.. తాను డిసైడ్ చేసిన పేరుతోనూ అమలు చేసే సంక్షేమ పథకాలకు కొత్త కొత్త పేర్లు పెట్టి.. వాటిని ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని.. సినిమాల విడుదలకు ముందు రిలీజ్ చేసే టీజర్ల మాదిరి.. జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ సర్కారు తీరు కారణంగా ఏపీలో చేపట్టాల్సిన వేలాది కోట్ల రైల్వే పనులు నిలిచిపోయిన షాకింగ్ నిజాన్ని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రం తన వంతుగా ఇవ్వాల్సిన వాటాను చెల్లించిన తర్వాతే తాము పనులు మొదలుపెడతామన్నారు. ఈ సమాధానం జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేంద్రమంత్రి ఈ మాట చెప్పటానికి కారణమైన ప్రశ్నను వేసింది మరెవరో కాదు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రూ.1636 కోట్లు ఇవ్వని కారణంగా రూ.10వేల కోట్ల విలువైన రైల్వేపనులు నిలిచిపోయినట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వ తీరు కారణంగా 841కి.మీ. మేర నాలుగులైన్ల పనులు ఆగాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నోట మాట విన్నంతనే విస్మయానికి గురి కావటం ఖాయం.
ఎందుకంటే..జగన్ ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలు.. ఇంతకు మించే ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రానికి ఇవ్వాల్సిన రాష్ట్రం వాటా ఇచ్చేస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుంది కదా? అలాంటివి జగన్ ఎందుకు మర్చిపోయినట్లు? అన్నది ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎంకు కళ్లు.. చెవులుగా ఉండే విజయసాయి రెడ్డి స్వయంగానే తానే ఈ ప్రశ్నను సంధించటం గమనార్హం. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసేలా ఈ క్వశ్చన్ చేయటం ఆసక్తికరంగా మారింది.

This post was last modified on March 20, 2021 9:56 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

43 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

1 hour ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

1 hour ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

4 hours ago