Political News

పవన్ ప్రభావం ఎంతో తేలిపోయిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం జనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసిన పవన్ మద్దతుదారులకు, అభిమానులకు, జనాలకు వీడియో సందేశాలను మాత్రం పంపించారు. అదేమిటంటే జనసేన అభ్యర్ధులను గెలిపించమని. పనిలో పనిగా వైసీపీని ఓడించమని కూడా పిలుపిచ్చారు. అయితే ఏ మున్సిపాలిటిలో కూడా పవన్ పిలుపుకు జనాలు స్పందించలేదని అర్ధమైపోయింది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టును పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ కు ఎప్పుడు వెళ్ళినా లేకపోతే అమరావతి ప్రాంతంలో తిరిగినా జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు అనేకసార్లు మాట్లాడారు. అయితే ఇటు వైజాగ్ లో కానీ అటు అమరావతి ప్రాంతంలో కానీ పవన్ను ఎవరు పట్టించుకోలేదని తేలిపోయింది.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన 49 డివిజన్లలో పోటీ చేసింది. 98 డివిజన్ల కార్పొరేషన్లలో బీజేపీ, జనసేన చెరో 49 డివిజన్లలో పోటీచేశాయి. జనసేన తరపున గెలిచింది కేవలం ముగ్గురంటే ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే. అదికూడా తమ సొంత బలంతో మాత్రమే గెలిచారు. ఎలాగంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ ఎక్కడా ప్రచారం చేయలేదు. పవన్ ప్రచారానికి రాకపోయినా ముగ్గురు గెలిచారంటే అది వారి సొంతబలం వల్లే అని తేలిపోయింది.

ఇక బీజేపీ తరపున పోటీ చేసిన 49 మందిలో గెలిచింది ఒక్కరంటే ఒక్కరు మాత్రమే. చెప్పుకోవటానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా విశాఖపట్నంలో పెద్ద పెద్ద నేతలే ఉన్నారు. మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు, మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, ఎంఎల్సీ మాధవ్ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ గెలిచింది మాత్రం ఒక్కరే. దీంతోనే బీజేపీ వైజాగ్ లో ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది. మొత్తానికి విడివిడిగా అయినా కలిసైనా మిత్రపక్షాల బలంపై క్లారిటి వచ్చేసింది.

This post was last modified on March 17, 2021 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

1 hour ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

2 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

2 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

4 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

4 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

4 hours ago