Political News

పవన్ ప్రభావం ఎంతో తేలిపోయిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం జనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసిన పవన్ మద్దతుదారులకు, అభిమానులకు, జనాలకు వీడియో సందేశాలను మాత్రం పంపించారు. అదేమిటంటే జనసేన అభ్యర్ధులను గెలిపించమని. పనిలో పనిగా వైసీపీని ఓడించమని కూడా పిలుపిచ్చారు. అయితే ఏ మున్సిపాలిటిలో కూడా పవన్ పిలుపుకు జనాలు స్పందించలేదని అర్ధమైపోయింది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టును పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ కు ఎప్పుడు వెళ్ళినా లేకపోతే అమరావతి ప్రాంతంలో తిరిగినా జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు అనేకసార్లు మాట్లాడారు. అయితే ఇటు వైజాగ్ లో కానీ అటు అమరావతి ప్రాంతంలో కానీ పవన్ను ఎవరు పట్టించుకోలేదని తేలిపోయింది.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన 49 డివిజన్లలో పోటీ చేసింది. 98 డివిజన్ల కార్పొరేషన్లలో బీజేపీ, జనసేన చెరో 49 డివిజన్లలో పోటీచేశాయి. జనసేన తరపున గెలిచింది కేవలం ముగ్గురంటే ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే. అదికూడా తమ సొంత బలంతో మాత్రమే గెలిచారు. ఎలాగంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ ఎక్కడా ప్రచారం చేయలేదు. పవన్ ప్రచారానికి రాకపోయినా ముగ్గురు గెలిచారంటే అది వారి సొంతబలం వల్లే అని తేలిపోయింది.

ఇక బీజేపీ తరపున పోటీ చేసిన 49 మందిలో గెలిచింది ఒక్కరంటే ఒక్కరు మాత్రమే. చెప్పుకోవటానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా విశాఖపట్నంలో పెద్ద పెద్ద నేతలే ఉన్నారు. మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు, మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, ఎంఎల్సీ మాధవ్ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ గెలిచింది మాత్రం ఒక్కరే. దీంతోనే బీజేపీ వైజాగ్ లో ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది. మొత్తానికి విడివిడిగా అయినా కలిసైనా మిత్రపక్షాల బలంపై క్లారిటి వచ్చేసింది.

This post was last modified on March 17, 2021 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

50 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago