Political News

పవన్ ప్రభావం ఎంతో తేలిపోయిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం జనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసిన పవన్ మద్దతుదారులకు, అభిమానులకు, జనాలకు వీడియో సందేశాలను మాత్రం పంపించారు. అదేమిటంటే జనసేన అభ్యర్ధులను గెలిపించమని. పనిలో పనిగా వైసీపీని ఓడించమని కూడా పిలుపిచ్చారు. అయితే ఏ మున్సిపాలిటిలో కూడా పవన్ పిలుపుకు జనాలు స్పందించలేదని అర్ధమైపోయింది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టును పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ కు ఎప్పుడు వెళ్ళినా లేకపోతే అమరావతి ప్రాంతంలో తిరిగినా జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు అనేకసార్లు మాట్లాడారు. అయితే ఇటు వైజాగ్ లో కానీ అటు అమరావతి ప్రాంతంలో కానీ పవన్ను ఎవరు పట్టించుకోలేదని తేలిపోయింది.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన 49 డివిజన్లలో పోటీ చేసింది. 98 డివిజన్ల కార్పొరేషన్లలో బీజేపీ, జనసేన చెరో 49 డివిజన్లలో పోటీచేశాయి. జనసేన తరపున గెలిచింది కేవలం ముగ్గురంటే ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే. అదికూడా తమ సొంత బలంతో మాత్రమే గెలిచారు. ఎలాగంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ ఎక్కడా ప్రచారం చేయలేదు. పవన్ ప్రచారానికి రాకపోయినా ముగ్గురు గెలిచారంటే అది వారి సొంతబలం వల్లే అని తేలిపోయింది.

ఇక బీజేపీ తరపున పోటీ చేసిన 49 మందిలో గెలిచింది ఒక్కరంటే ఒక్కరు మాత్రమే. చెప్పుకోవటానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా విశాఖపట్నంలో పెద్ద పెద్ద నేతలే ఉన్నారు. మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు, మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, ఎంఎల్సీ మాధవ్ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ గెలిచింది మాత్రం ఒక్కరే. దీంతోనే బీజేపీ వైజాగ్ లో ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది. మొత్తానికి విడివిడిగా అయినా కలిసైనా మిత్రపక్షాల బలంపై క్లారిటి వచ్చేసింది.

This post was last modified on March 17, 2021 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago