ఏప్రిల్ 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ప్రత్యర్ధులకు వైసీపీ సవాలు విసిరింది. ఇంతకాలం అనధికారికంగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తినే అధికారికంగా తమ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తేలాల్సింది బీజేపీ అభ్యర్ధి మాత్రమే. కాంగ్రెస్ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.
ఉపఎన్నికలో ఎంతమంది నామినేషన్లు వేసినా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీ మధ్య మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. దాదాపు ఐదునెలల క్రితమే పనబాకను తమ అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు ప్రకటించినా ఆమె ఇంతవరకు యాక్టివ్ కాలేదు. అసలామె పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఏకపక్షంగా తన పేరును చంద్రబాబు ప్రకటించేశారని పనబాక బాగా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.
ఎంతమంది నేతలు ఆమెను ప్రచారానికి రమ్మని పిలిచినా ఇప్పటివరకు ఆమె ప్రచారానికి దిగలేదు. ఒకసారి కరోనా వైరస్ అని తర్వాత తన కూతురు వివాహం అని కారణాలు చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రచారానికి రాకపోవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ఈమధ్యనే వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పనబాక వెనకాడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.
తిరుపతి లోక్ సభ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్ళఊరుపేట నియోజకవర్గాలున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి ఉన్నాయి. వీటిల్లో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటిలు, తిరుపతి కార్పొరేషన్లను వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ప్రజల నాడిచూసిన తర్వాత పనబాక ఇపుడు పోటీకి వెనకాడుతున్నట్లు సమాచారం. సరే బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని కూడా జనాలు పట్టించుకోవటం లేదు.
This post was last modified on March 17, 2021 12:52 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…