Political News

సవాలు విసిరిన వైసీపీ

ఏప్రిల్ 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ప్రత్యర్ధులకు వైసీపీ సవాలు విసిరింది. ఇంతకాలం అనధికారికంగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తినే అధికారికంగా తమ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తేలాల్సింది బీజేపీ అభ్యర్ధి మాత్రమే. కాంగ్రెస్ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.

ఉపఎన్నికలో ఎంతమంది నామినేషన్లు వేసినా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీ మధ్య మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. దాదాపు ఐదునెలల క్రితమే పనబాకను తమ అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు ప్రకటించినా ఆమె ఇంతవరకు యాక్టివ్ కాలేదు. అసలామె పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఏకపక్షంగా తన పేరును చంద్రబాబు ప్రకటించేశారని పనబాక బాగా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.

ఎంతమంది నేతలు ఆమెను ప్రచారానికి రమ్మని పిలిచినా ఇప్పటివరకు ఆమె ప్రచారానికి దిగలేదు. ఒకసారి కరోనా వైరస్ అని తర్వాత తన కూతురు వివాహం అని కారణాలు చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రచారానికి రాకపోవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ఈమధ్యనే వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పనబాక వెనకాడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.

తిరుపతి లోక్ సభ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్ళఊరుపేట నియోజకవర్గాలున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి ఉన్నాయి. వీటిల్లో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటిలు, తిరుపతి కార్పొరేషన్లను వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ప్రజల నాడిచూసిన తర్వాత పనబాక ఇపుడు పోటీకి వెనకాడుతున్నట్లు సమాచారం. సరే బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని కూడా జనాలు పట్టించుకోవటం లేదు.

This post was last modified on March 17, 2021 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

21 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

35 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago