Political News

ముహూర్తం ఫిక్స్‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రెడీ?!

స్థానిక ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకుని.. జోష్ మీదున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇదే కీల‌క స‌మ‌యంగా.. త‌న ఎత్తులు పారించుకునేందుకు అడుగులు వేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు కార్పొరేష‌న్ల‌లో వైసీపీ విజ‌యం సాధించ‌డం ఇప్పుడు జ‌గ‌న్ వ్యూహాల‌ను అమ‌లు చేసుకునేందుకు సాకుగా మారింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో మాత్ర‌మే వైసీపీ ఆశించిన విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శించింది. అయితే.. ఇక్క‌డ నిజానికి అమ‌రావ‌తి విష‌యం కొంచెం ప‌క్క‌న పెడితే.. నిజానికి టీడీపీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌వుతున్న నిర్బంధాల కార‌ణంగా.. త‌మ్ముళ్లు జంకారు. ఇది వైసీపీకి అనుకూలంగా మారింద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే.. రాజ‌కీయంగా మాత్రం తాము గెలిచాం కాబ‌ట్టి.. మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని వైసీపీ మంత్రులు, ఇత‌ర నాయ‌కులు కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. స‌రే.. ఈ విష‌యం ఇలా ఉంటే.. విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. అక్క‌డికి ఇప్ప‌టికే కొన్ని సంస్థ‌ల‌ను అన‌ధికారికంగా పంపించినా.. వైసీపీకి బొటా బొటీ ఫ‌లితమే ద‌క్కింది.

మొత్తం 98 డివిజ‌న్ల‌లో వైసీపీకి ద‌క్కింది కేవ‌లం 58. అంటే.. మెజారిటీకి కేవ‌లం 8 మాత్ర‌మే ఎక్కువ‌గా డివిజ‌న్లు ద‌క్కాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. విశాఖ ప్ర‌జ‌లు వైసీపీ వేసిన ప్లాన్‌ను తిర‌స్క‌రించార‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. కూడా జ‌గ‌న్ అండ్ కోలు.. త‌మ వ్యూహాన్ని పారించుకునేందుకు ఇదే స‌మ‌యం అన్న‌ట్టుగా ముందుకు సాగుతున్నారు.

తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిని త‌ర‌లించేందుకు విశాఖ శార‌దా పీఠాధిప‌తి.. ముహూర్తం నిర్ణ‌యించారు. మే 6వ తేదీని.. ముహూర్తంగా నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. అప్ప‌టికి అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు విశాఖ చేరుకుని.. రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇది అధికారికంగా మాత్రం కాదు.. మౌఖికంగా ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశార‌ని తెలిసింది.

అంటే.. విశాఖ ప్ర‌జ‌లు బొటాబొటీ తీర్పు ఇచ్చినా.. తాము అనుకున్న‌ది చేసేందుకు మాత్రం వైసీపీ నాయ‌కులు రెడీ అయిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు ముహూర్తం కూడా ఖ‌రారైన నేప‌థ్యంలో మే 6 విష‌యం వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈలోగా మ‌ళ్లీ కోర్టు జోక్యం చేసుకుని ఏమైనా ఆపితే త‌ప్ప‌.. వైసీపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 16, 2021 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

1 hour ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

1 hour ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

2 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

3 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

4 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

5 hours ago