ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్కు వచ్చారంటే.. ఆయన మాట్లాడే మాటలు విని చెవుల తుప్పు వదిలిపోవాల్సిందే. ఏమాత్రం మాటలపై అదుపు ఉండని ఆయన.. ప్రత్యర్థుల్ని దారుణాతి దారుణంగా తిట్టేస్తారు. బూతులు కూడా వాడేస్తారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి తన మాజీ బాస్ చంద్రబాబు నాయుడును ఎలా తిట్టిపోస్తున్నారో తెలిసిందే.
ఓ సందర్భంలో ఆయన చనిపోతే బావుణ్ననే కామెంట్ కూడా చేశారు నాని. తాజాగా శనివారం విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన నాని.. చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు మనిషివా దున్నపోతువా అంటూ బాబును తిట్టిపోశారు. గ్యాస్ లీక్ ఉదంతంలో చంద్రబాబు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ నాని ధ్వజమెత్తారు.
‘‘1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో ప్రమాదం జరిగింది. అప్పడెందుకు చంద్రబాబు కంపెనీని మూయించలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కంపెనీ విస్తరణకు అనుమతించారు. ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇస్తుంటే.. ఈ కోటి ఇస్తే చనిపోయిన వాళ్లు బతికొస్తారా అని చంద్రబాబు అడుగుతున్నాడు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ వల్ల 30 మంది చనిపోయారు. అప్పుడు వాళ్లు బతికొస్తారని రూ.3 లక్షలు ఇచ్చారా? చంద్రబాబు మనిషివా.. దున్నపోతువా?. చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చినా సిగ్గు శరం లేదు. విశాఖ వెళ్తే చంద్రబాబును ఎవడు ఆపుతాడు?. కరోనాకు భయపడి అద్ధాల మేడలో చంద్రబాబు అద్దాల మేడలో దాక్కున్నాడు. భయంతో విశాఖ పోలేదు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకొని విమర్శలు చేయాలి. నాలుగు రోజులైతే చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది’’ అంటూ నాని విమర్శించారు.
This post was last modified on May 10, 2020 1:57 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…