జనాలు నెమ్మదిగా కరోనాను లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేస్తోందని బయట పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకుముందులా భయపడటం మానేసి జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. పోలీసులు కూడా మరీ స్ట్రిక్టుగా ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గిపోవడంతో జనాల్లో తేలిక భావం వచ్చినట్లు అనిపిస్తోంది.
గత పది రోజుల్లో వచ్చిన కేసులన్నీ కలిపినా వంద లోపే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక దశలో రోజు మొత్తంలో రెండు కేసులే బయటపడ్డాయి. శుక్రవారం నమోదైన కేసులు పది. దీంతో తెలంగాణలో కరోనా కర్వ్ తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయనే ఆశతో ఉన్నారు జనాలు. ఐతే శనివారం ఉన్నట్లుండి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
ఒక రోజు వ్యవధిలో తెలంగాణలో 31 కేసులు బయటపడ్డాయి. గత పది రోజుల్లో అత్యధికంగా కేసులు బయటపడ్డది ఈ రోజే. మరి ఈ సడెన్ జంప్కు కారణమేంటన్నది ఆసక్తికరంగా మారింది. మద్యం దుకాణాలు బుధవారం పునఃప్రారంభం కావడంతో జనాలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. ఉన్నంతలో క్రమశిక్షణతోనే వ్యవహరించినప్పటికీ.. మందు బాబుల అత్యుత్సాహం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమై ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య పెరిగిందని.. మున్ముందు ఇంకా పెరగొచ్చని అంటున్నారు.
ఈ రోజు కేసుల సంఖ్య బయటికి రాగానే నింద మందు బాబుల మీదికి వెళ్తోంది. మద్యం దుకాణాలు బంద్ చేయాలన్న డిమాండ్ మళ్లీ పైకి లేచింది. పొరుగున ఏపీలో గత 24 గంటల్లో 43 కరోనా పాజిటవ్ కేసులు తేలినట్లు శనివారం ఉదయం బులెటిన్ ఇచ్చారు. ఐతే తెలంగాణలో కరోనా టెస్టులు చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నారని, టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని నిపుణులంటున్నారు.
This post was last modified on May 10, 2020 1:53 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…