జనాలు నెమ్మదిగా కరోనాను లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేస్తోందని బయట పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకుముందులా భయపడటం మానేసి జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. పోలీసులు కూడా మరీ స్ట్రిక్టుగా ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గిపోవడంతో జనాల్లో తేలిక భావం వచ్చినట్లు అనిపిస్తోంది.
గత పది రోజుల్లో వచ్చిన కేసులన్నీ కలిపినా వంద లోపే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక దశలో రోజు మొత్తంలో రెండు కేసులే బయటపడ్డాయి. శుక్రవారం నమోదైన కేసులు పది. దీంతో తెలంగాణలో కరోనా కర్వ్ తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయనే ఆశతో ఉన్నారు జనాలు. ఐతే శనివారం ఉన్నట్లుండి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
ఒక రోజు వ్యవధిలో తెలంగాణలో 31 కేసులు బయటపడ్డాయి. గత పది రోజుల్లో అత్యధికంగా కేసులు బయటపడ్డది ఈ రోజే. మరి ఈ సడెన్ జంప్కు కారణమేంటన్నది ఆసక్తికరంగా మారింది. మద్యం దుకాణాలు బుధవారం పునఃప్రారంభం కావడంతో జనాలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. ఉన్నంతలో క్రమశిక్షణతోనే వ్యవహరించినప్పటికీ.. మందు బాబుల అత్యుత్సాహం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమై ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య పెరిగిందని.. మున్ముందు ఇంకా పెరగొచ్చని అంటున్నారు.
ఈ రోజు కేసుల సంఖ్య బయటికి రాగానే నింద మందు బాబుల మీదికి వెళ్తోంది. మద్యం దుకాణాలు బంద్ చేయాలన్న డిమాండ్ మళ్లీ పైకి లేచింది. పొరుగున ఏపీలో గత 24 గంటల్లో 43 కరోనా పాజిటవ్ కేసులు తేలినట్లు శనివారం ఉదయం బులెటిన్ ఇచ్చారు. ఐతే తెలంగాణలో కరోనా టెస్టులు చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నారని, టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని నిపుణులంటున్నారు.
This post was last modified on May 10, 2020 1:53 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…