ఎన్నికల్లో ఓటమితోనే రాజకీయ పార్టీ ఖతమైపోతుందా? రాజకీయం గురించి తెలిసిన వారెవరూ.. అవునన్న మాట చెప్పరు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ విపక్షం టీడీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశాధినేత.. పార్టీకి చెందిన నేతలు ఊహించలేరేమో కానీ.. ఏపీ రాజకీయ పరిణామాల్ని సునిశితంగా పరిశీలించే ప్రతి ఒక్కరు వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న అంచనాలు వేసుకున్నారు. అనుకున్నట్లే.. వారు పురపోరులో విజయదుందుబిని మోగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ విజయానందంలో ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏపీలో టీడీపీ ఖతమైందని.. పూర్తిగా చచ్చిపోయిందని.. ఆ పార్టీ నిలదొక్కుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తేనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బాగుపడాలంటే.. నిలదొక్కుకోవాలంటే ఎవరిని తీసుకురావాలి? లాంటి సలహా ఇచ్చిన మంత్రిగా బాలినేని నిలిచిపోతారేమో? అయినా.. ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం.. దాని పని అయిపోతుందా? ఒకవేళ అయిపోతుంటే మాత్రం.. తన రాజకీయ ప్రత్యర్థిగా ఎవరు ఉండాలన్న విషయాన్ని మంత్రి బాలినేని లాంటోళ్లు కోరుకోవటం దేనికి నిదర్శనం అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మరోవైపు రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడని వేళ.. ఆయన్ను సీన్లోకి తీసుకురావటం ద్వారా బాలినేని తనదైన పొలిటికల్ గేమ్ షురూ చేశారని చెబుతున్నారు. టీడీపీ పని అయిపోయింది.. ఫలానా వారు వస్తే తప్పించి ఆ పార్టీ బతికి బట్టకట్టదన్న విషయాన్ని అదే పనిగా ప్రస్తావించటంలో అర్థం లేదని చెప్పాలి. అయినప్పటికీ.. అలాంటి వ్యాఖ్యలు బాలినేని లాంటి మంత్రి ఒకరు చేయటం వెనుక బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా మంత్రిగా ఉంటూ.. ఒక పార్టీ బతకాలంటే.. పోరాట పటిమను ప్రదర్శించాలంటే ఎవరు పగ్గాలు తీసుకోవాలో ప్రత్యర్థిగా బాలినేని వారు డిసైడ్ చేయటం విశేషంగా చెప్పక తప్పదు. దీనిపై టీడీపీవర్గాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.
This post was last modified on March 16, 2021 12:45 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…