తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్….కొద్ది నెలల క్రితమే ఏపీలోని 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు, ఏపీలో మద్యం ధరలను పెంచి తద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించారు. ఇక, తాజాగా ఏపీలో మద్యపాన నిషేధం దిశంగా మరో అడుగు వేసింది. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. మే 31 నాటికి షాపులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఏపీలో మొత్తం 33 శాతం మద్యం షాపులు తొలగించినట్లయింది.
గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. 43వేల బెల్టు షాపుల తొలగింపుతోపాటు, 40 శాతం బార్లను గతంలోనే ప్రభుత్వం తగ్గించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. కాగా, కరోనా విపత్తు సమయంలోనూ మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.
మే 4 నుంచి ఏపీలో మద్యం ధరలను 25 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం…ఆ తర్వాత మరో 50 శాతం పెంచింది. మద్యం వాడకాన్ని తగ్గించేందుకు మొత్తంగా ధరలను 75 శాతం పెంచింది. ధరలను అమాంతం పెంచినప్పటికీ ఏపీలోని వైన్ షాపుల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.
కాగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం….సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
This post was last modified on May 11, 2020 10:45 pm
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…
గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…