తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్….కొద్ది నెలల క్రితమే ఏపీలోని 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు, ఏపీలో మద్యం ధరలను పెంచి తద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించారు. ఇక, తాజాగా ఏపీలో మద్యపాన నిషేధం దిశంగా మరో అడుగు వేసింది. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. మే 31 నాటికి షాపులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఏపీలో మొత్తం 33 శాతం మద్యం షాపులు తొలగించినట్లయింది.
గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. 43వేల బెల్టు షాపుల తొలగింపుతోపాటు, 40 శాతం బార్లను గతంలోనే ప్రభుత్వం తగ్గించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. కాగా, కరోనా విపత్తు సమయంలోనూ మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.
మే 4 నుంచి ఏపీలో మద్యం ధరలను 25 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం…ఆ తర్వాత మరో 50 శాతం పెంచింది. మద్యం వాడకాన్ని తగ్గించేందుకు మొత్తంగా ధరలను 75 శాతం పెంచింది. ధరలను అమాంతం పెంచినప్పటికీ ఏపీలోని వైన్ షాపుల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.
కాగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం….సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
This post was last modified on May 11, 2020 10:45 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…