Political News

తాడిప‌త్రి, మైదుకూరు కూడా వైసీపీకే.. ఎలాగంటే..!

రాష్ట్ర వ్యాప్తంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసి.. జోరుమీదున్న వైసీపీకి పంటికింద రాయిలా.. కంట్లో న‌లుసులా.. రెండు మునిసిపాలిటీలు మారాయి. వీటిలో అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి, క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు. ఈ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్య‌ర్థులు మెజారిటీ సాధించారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ వైసీపీ ప్ర‌స్తుతం ప‌రాజ‌యం పాలైంది. అయితే.. ఇక్క‌డ కూడా.. త‌మ ఖ‌తా తెరుస్తామ‌ని.. వీటిని కూడా త‌మ బుట్ట‌లో వేసుకుంటామ‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సాంకేతికంగా చూస్తే.. ఇది వైసీపీకి సాధ్య‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. వైసీపీ ద‌గ్గ‌ర ఎక్స్ అఫీషియో.. ఓట్ల బ్యాంకు ఉండ‌డ‌మే.

తాడిప‌త్రి విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రంగంలోకి దిగి.. టీడీపీ త‌ర‌ఫున త‌న వారిని నిల‌బెట్టారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కి.. మునిసిప‌ల్ చైర్మ‌న్ గిరిని సొంతం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే హోరా హోరీ సాగిన పోరులో .. జేసీ వ‌ర్గం.. ఆశించిన విధంగానే దూకుడు చూపించింది. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 16 చోట్ల విజ‌యం సాధించింద‌. ఇక‌, టీడీపీ ఇక్క‌డ 18 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఇద్ద‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. మునిసిప‌ల్‌లో పార్టీ పాగా వేయాలంటే.. 19 మంది అభ్య‌ర్థుల మ‌ద్ద‌తు అవ‌స‌రం.

ఈ క్ర‌మంలో వైసీపీ త‌న‌కున్న ఎక్స్ అఫిషియో.. ఓట్లు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఓట్ల‌ను వినియోగించుకుని.. మ‌రో స్వ‌తంత్ర అభ్య‌ర్థిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇది సాధ్యం అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ఇదే జ‌రిగితే.. జేసీ వ‌ర్గం చేసిన కృషి మ‌ట్టిపాల‌వడం ఖాయ‌మ‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో మైదుకూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌.. టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ముందుకు సాగాయి. టీడీపీ త‌ర‌ఫున పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నించారు.

ఇక్క‌డ మొత్తం.. 24 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 11, టీడీపీ 12, ఇత‌రులు ఒక చోట విజ‌యం ద‌క్కించుకున్నారు. సాంకేతికంగా చూస్తే.. టీడీపీ గెలిచిన‌ట్టు అనిపించినా.. ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో .. ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి. మైదుకూరు ఎమ్మెల్యే , రాజంపేట ఎంపీలు ఇద్ద‌రూ కూడా వైసీపీ నేత‌లే క‌నుక‌.. ఇక్క‌డ కూడా వైసీపీనే పాగా వేస్తుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇలా చూస్తే.. మొత్తంగా టీడీపీ జీరో కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 15, 2021 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డైరెక్ట‌ర్ ప్రాణాల‌తో ఆడుకున్న నెట్‌ఫ్లిక్స్

బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ స‌హా ప‌లు గొప్ప చిత్రాల‌తో బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు…

3 hours ago

ఎమ్మెల్యేల‌తో `ఆట‌లు`: ముహూర్తం ఫిక్స్

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలలో  కేవ‌లం చ‌ర్చ‌లు, ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల‌కు క్రీడ‌లు పోటీలు…

5 hours ago

బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి.…

9 hours ago

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

10 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

11 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

13 hours ago