వెనుకా ముందు చూసుకోకుండా తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకి వస్తారు ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఆయన మీడియా ముందుకు వస్తే చాలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు.
తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ ఆయన మరోసారి నోరు విప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై సంచలన విజయాన్ని నమోదు చేసిన గ్రంధి.. అవకాశం వచ్చిన ప్రతిసారీ పవన్ పై తీవ్రంగా విరుచుకుపడుతుంటారు.
తాజాగా వెల్లడైన ఫలితాల నేపథ్యంలో మాట్లాడిన గ్రంధి.. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘‘విడాకులు తీసుకొని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఇక్కడ విలువలు.. సిద్ధాంతాలు ఉంటాయి. నిన్న.. మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలను పవన్ మోసం చేశారు. టీడీపీతో కలిసి విడిపోయి.. బీజేపీతో కలిసి లోపాయికారిగా కింద స్థాయి టీడీపీతో కలిసి పని చేస్తున్నారు. బాబు.. పవన్ నీచ రాజకీయాలను ప్రజలు రిజెక్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు.
మూడు పెళ్లిళ్లు.. మూడుపార్టీలతో పొత్తు అంటూ గ్రంధి తీసుకొచ్చిన పోలిక పై జనసైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనను ఎప్పుడు పడితే అప్పుడు వెనుకా ముందు చూసుకోకుండా చురకలు అంటించే గ్రంధిపై పవన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on March 15, 2021 8:46 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…