Political News

బీజేపీకి మొదలైన టెన్షన్

మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం బీజేపీపై మొదలైంది. పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రైతుసంఘాలు కమలంపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. ఏ పార్టీకైనా ఓట్లేయండి కానీ బీజేపీకి మాత్రం వేయవద్దంటు రైతుఉద్యమ సంఘం ఆధ్వర్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా కీలక నేత యోగేంద్ర యాదవ్ ప్రచారం మొదలుపెట్టారు.

యోగేంద్ర ఆధ్వర్యంలో బెంగాల్లోని రైతుసంఘాలు బీజేపీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున మొదలుపెట్టింది. బెంగాల్ ఎన్నికల్లో కమలంపార్టీ ఓడిపోతేకానీ నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రప్రభుత్వం ఆలోచించదని యోగేంద్ర స్పష్టంగా చెబుతున్నారు. శని, ఆదివారాల్లో కిసాన్ మహా పంచాయత్ పేరుతో రైతుసంఘాల నేతలు రాకేష్ సింగ్ తికాయత్, యధువీర్ సింగ్ బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.

కేంద్రప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో భాగంగా పైన చెప్పిన కీలక నేతలు భవానీపూర్, నందిగ్రామ్, సింగూర్, అసన్ సోల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అంటే ఒకవైపు మమతబెనర్జీ నరేంద్రమోడి, అమిత్ షా తదితరులపై విరుచుకుపడుతుంటే మరోవైపు రైతుసంఘాల నేతలు కూడా బీజేపీ వ్యతిరేక ప్రచారంలో జోరు పెంచబోతున్నారు. దాంతో బీజేపీ నేతలకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయమనే అనిపిస్తోంది.

ఎందుకంటే రాకేష్ తికాయత్ బలమైన రైతు నేత. ఈయన ప్రభావం ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్ధాన్, బెంగాల్, మహారాష్ట్రలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దళిత్ పంచాయత్ కూడా కేంద్రప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ చేసింది. తికాయత్ పిలుపుకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు దళిత్ పంచాయత్ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి బెంగాల్లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అగ్రనేతలకు టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on March 14, 2021 3:25 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

2 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

2 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

8 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

9 hours ago

ఇళయరాజాకు ఇది తగునా?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…

10 hours ago

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు…

10 hours ago